1, జులై 2008, మంగళవారం

ఆకలి మందం తాగ్గాలంటే...?

చాలామంది టైం అయ్యిందని తింటారేతప్ప ఆకలి తెలియదు. ఆకలి మందం అనేది ముఖ్యంగా పిల్లలలో ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మలబద్దకం. ఎవరిలో మలబద్దకం ఉన్నా వారికి ముందు ఆకలి తగ్గిపోతుంది. విరేచనం సాఫీగా కానందుకు మలం ప్రేగంతా మలంతో నిండిపోయి ఉంటుంది. అది వెళ్ళాక పోయినా పైనుండి తినేది ఆపరు. బయటకు వెళ్ళే దాన్ని బట్టి లోపలకు వచ్చేది ఆదారపడి ఉంటుంది. ప్రేగుల వాతావరణం చెడిపోయి ఆకలి మందగిస్తుంది. ఆకలి లేకపోయినా తినకపోతే నీరసం అని తినేసరికి ఇంకా సమస్య మరీ ముదిరిపోతుంది.
చిట్కాలు:
1) 5,6 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం పూట ఎనిమా చేసి ప్రేగులను శుభ్రపరచుకోవడం మంచిది.
2) ఉదయం పాలు, జావలు, టిఫిన్లు మొలక గింజలు మొదలగునవి పూర్తిగా మనాలి, నీళ్లు త్రాగడం పూర్తయ్యాక 8, 9 గంటలకు టిఫిన్ కింద బొప్పాయి, సపోటా, ఖర్జూరం పండు, దానిమ్మ లాంటి పండ్లను సరిపడా తినవచ్చు.
3) మద్యాహ్నం తేలికగా అరిగేతట్లు కూరలను చప్పగా చేసుకును (ఆకుకూరలు, దుంపలు, కండి, పెసరపప్పు) పులకాలతో ఎక్కువ కూర పెట్టుకుని తినాలి.
4) రాత్రికి భోజనంగా 5,6, గంటలకే పండ్లు తిని ఆపాలి. పొట్టను రాత్రికి మాడ పెట్టడం వల్ల ఆకలి పుడుతుంది. సమస్య తగ్గాక రోజూ విరేచనం సాఫీగా అయ్యేటట్లుగా చూసుకుంటే ఆకలి మందం కలగదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి