1, జులై 2008, మంగళవారం

ఫుడ్ ఎలేర్జీ తగ్గాలంటే ?... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మంచికీ, చెడుకీ మధ్యా ఘర్షనే ఎలేర్జీ అంటే. భార్యా భర్తలిద్దరూ మంచివారైతే వారిద్దరి మధ్యా ఈ గొడవలు రాకుండా జీవితం సాఫీ గా నడుస్తుంది. అదీ మాదిరిగా అటు ఆహారము, ఇటు శరీరము రెండూ (ఆహారము ప్రకృతి సిద్దముగా ఉంది, శరీరము కూడా సహజంగా ఉంటే) ఒకే విధంగా ప్రకృతి సహజముగా ఉంటే వాటి మధ్య ఏ గొడవా (ఎలర్జీ) రాదు. భార్యాభర్తలిద్దరూ చేద్దవారైనా వారి మధ్యా ఏ గొడవలూ ఉండవు. వాళ్ళిద్దరూ బాగా కలిసిపోతారు. అలాగే, అటు ఆహారము చెడ్డదిగాఉండి ఇటు శరీరము కూడా చేదిపూయి అసహజంగా ఉంటే ఈ రెండూ కలిసిపోయి ఏ ఎలర్జీ రాదు. ఒకరు మంచివారు ఒకరు చెడ్డవారు అయినప్పుడీ గొడవలు మొదలయ్యేది. ఈ మధ్య జనాలకు, తేనెకు, కొబ్బరికి, నిమ్మకాయలకు ఇతర పులుపులకు, ఎండకు, మంచుకు, దుమ్ముకు, కూరగాయలకు, గింజలకు (ఇవన్నీ ప్రకృతి సిద్దమైనవి) మొదలగు వాటితో ఎలేర్జీ వస్తున్నది. ఇలాంటి వాటికి ఎలర్జీ వస్తున్నదంటే శరీరంలో అసహజమైనవి నిల్వయుండి, ఎలర్జీని కలిగించే పదార్ధాలు పుట్టి, లోపల అసహజంగా మారి పైన చెప్పినలాంటివి తగిలే సరికి దురదలు, దద్దుర్లు, వాపులు, గొంతులో తీదాలు మొదలగునవి వచ్చేస్తాయి. అవి పడటం లేదు కాబట్టి, వాటిని పూర్తిగా మానేస్తే పోతుంది గదా అని వాటిని మానివేస్తూ ఉంటారు. లోపల అసహజత పెరుగుతూ నిదానంగా ఇతర ప్రకృతి సిద్దమైన ఆహారాలకు కూడా ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. మాంసం పడటం లేదని కానీ, ఆవకాయ పడటంలేదని, చాక్లెట్లు, బిస్కెట్లు పడటంలేదని డాక్టరు దగ్గరకు వెళ్లి వీటికి నాకు ఎలర్జీ వస్తుందనే వారు ఎవరన్నా ఉన్నారా? ఇలాంటివి శరీరానికి బాగా పడుతున్నాయి. మన శరీరం చెడిపోయి ఉండేసరికి చెడులో చెడు పడే సరికి కలిసి పోతున్నాయి. రా, రా ! మనమిద్దరం ఫ్రెండ్స్ అంటూ కలుస్తాయి. ఎలర్జీ పూవాలంటే వేటినీ మనడం పరిష్కారం కాదు, మనలో ఎలర్జీ లకి మూలాన్ని కదిగివేసి శరీరాన్ని సహజంగా మార్చుకుంటే అన్నీ మళ్ళీ పడతాయి.
చిట్కాలు:
1) మంచినీరు తక్కువగా త్రాగే వారికి ఎకువగా ఎలర్జీలు వస్తాయి. కాబట్టి 5 లీటర్లు నీరు ప్రతిరోజూ అలవాటు చేసుకోవాలి.
2) ముందు 2,3 రోజుల పాటు తేనె నీళ్ళలో ఉపవాసం (నిమ్మపడక పోతే మానివేసి వట్టి తేనె + నీళ్లు త్రాగవచ్చు) చేస్తే మంచిది. ఉపవాసంలో అవసరమైతే కొబ్బరినీళ్లు రెండవ, మూడవ రోజుగానీ త్రాగవచ్చు.
3) నాల్గవ రోజు నుండీ ఏ పళ్ళు పడితే, ఏ రసాలు పడితే వాటితోనే రోజుకి 5,6సార్లుగా అందులోనే తేనె వీసుకుని త్రాగుతూ 3,4 రోజులుంటే మంచిది. చెరుకురసం పడితే త్రాగవచ్చు.
4) ఆ తరువాత రోజు నుండే ఉదయం పూట 8 గంటలకు రసాలు, 9,10 గంటలకు పండ్లు తిని మద్యాహ్నం భోజనంలో పుల్కాలతో చప్పటి కూర (ఏది పడితే అది కూర) తో తిని, సయంకాలం 5,6 పండ్లు తిని ఆపాలి. ఇలా 5,6 రోజులు చీస్తే శరీరం లోపల శుభ్రం అయి, రక్తం మారి కొంత సహజత్వము వస్తుంది.
5) ఇలా 10, 12 రోజులు గడిచాక మీకు పడని వాటిని మెల్లగా ఒక్కటీ అలవాటు చేసుకుంటే అవే సరిపడుతుంటాయి. లేదా ఇంకో 10 రోజుల తారవాతైనా అలవాటు చేసుకోండి. ఎవరికన్నా ఇంకా తగ్గకపోతే ఆహారము, ఉప్పు నూనెలు సాంతం మాని తింటే అప్పుడు పూర్తిగా తగ్గి పోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి