31, మార్చి 2008, సోమవారం

కంటి చూపు పెరగాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

కంటి చూపు పెరగాలంటే :-

పూర్వం కంటి చూపు తగ్గితే ఇక అక్కడ నుండీ ముసలి వయస్సు వచినట్లుగా లెక్కవేసుకునేవారుఈ మధ్య బాల్యదశ పూర్తి కాకుండానే కంటి చూపు తగ్గి పోతుంది. కొన్ని జీవులు 400 నుండీ 1000 సంవత్సరాల వరకు జీవించేవి ఉన్నవి. అంతకాలం జీవించినా ఏ జీవికి ఇంత వరకు కళ్ళజోడు అవసరం తెలియకుండానే జీవించగలుగుతున్నాయి. అన్నీ ఉడికించి, వార్చి, మాడ్చి, అందులో ఉప్పు, నూనెలు కలుపుకుని తినే సరికి, కంటి అవసరాలు ఆహరం ద్వారా తీరడం లేదు. ప్రకృతిలో పచ్చదనాన్ని చూసి విశ్రాంతి పొందవలసింది పోయి జిగేలు మనే రంగు రంగుల బొమ్మలు చూసేసరికి శుబ్రంగా చెడిపోతున్నాయిదీనికి పరిష్కార మార్గం, మళ్ళీ సహజంగా జీవించడమే.

చిట్కాలు:-
౧) ప్రతీ రోజూ ఉదయం క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుని పచ్చికూరాల రసం త్రాగాలి.
౨) అవకాసమున్న వారూ మునగ ఆకుని రోజూకొంత పచికూరాల రసం లో వేసుకుని త్రాగితే మంచిది. లీద వారానికి 1,2, రోజులు విడిగా మునగ ఆకు రసాన్ని తీసి దీనిలో నీరు ఎక్కువగా కలిపి, తేనే, నిమ్మ రసం కలుపుకొని త్రగాగాలిగినా మంచిదే.
౩) రోజూ మద్యాహ్నం భోజనంలో ఆకుకూరాలను తప్పనిసరిగా వండుకుని తినాలి.
౪) అవకాశముంది దొడ్డిలో ఆకుకూరాలను స్వయముగా పండించుకున్నవి అయితే పచికూరాల రసం లో రోజూ ఆకుకూరాలను వేసుకుని త్రాగితే మరీ మంచిది.
౫) ఏకాలం లో దొరికితే పండ్లను ఆ కాలంలో రూజుకి 20 శతమన్న తినాలి.
౬) ఉప్పును ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఆ ఉప్పు వల్ల కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు తొందరగా పాడైపోతున్నై.

కాని వాని చేత గాసు వీసంబిచ్చిన __ vemanna

కాని వానిచేత గాసు వీసంబిచ్చి
వెంట దిరుగువాడే వెర్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభి రామ వినుర వేమ.

_______

దుర్మార్గుని చేతికి ధనము ఇచ్చి దానికొరకు మరల అతని వెంట తిరుగుట తెలివితక్కువ తనము. పిల్లి మ్రింగిన కోడి పిలిచిననూ పలకదు..___ వేమన్న

చెరచు __ vemanna

ఒరుని చెర చెధమని యుల్ల మందేంతురు
తమకు చేతెరుగని ధరని నరులు
తమ్ముం జెరచువాడు దైవంబు లేడోకో
విశ్వ దాభి రామ వినుర వేమ.

--------------------

ఇతరులను పాడు చేయవలయునని కొందరు ఆలోచన చేయుదురు. కాని, తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు. ఒకరిని పాడుచేయవలయుననిన భగవంతుడు వారినే పాడు చేయును.___ వేమన్న

పట్టు పట్ట రాదు__ వేమన్న

పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడచుకన్న బరగ జచ్చుట మేలు
విశ్వదాభి రామ వినుర వేమ.
--------------

పట్టుదలయే వహింపరాదు. వహించినచో ఆ పట్టు వదల రాదు. పట్టినపట్టు నడిమిలోనే విడుచతకంటే మరణము మేలు. ____ వేమన

భుక్తాయాసం తగ్గాలంటే__ మంతెన సత్యనారాయణ రాజు

వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అల మాత్రం లేవలేక పోతున్నామని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్లుగా నిండి ఈ బరువంతా వెళ్లి ఊపిరితిత్తుల చివరి భాగాల ఫై పడి, వాటిని సుమారుగా 25,30 శాతం నొక్కి వేస్తుంది. భోజనాన్ని ఆరగించడానికి శరీరానికి ఎక్కువగాలి అవసరం ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయే సరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం ఐన దగ్గరనుండీ భుక్తాయాసం వస్తుంది.
చిట్కాలు :-
1) భోజనాన్ని తినేటప్పుడు టేబుల్ ఫై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా, నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
2) తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరవాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు.
3) పొట్టను 80 శాతం కంటే నింపే విధం గా తినకుండా జాగర్త పడటం మంచిది.

27, మార్చి 2008, గురువారం

ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మెన్సాస్లు నెల నెలాటైం ప్రకారం వస్తూ రక్తస్రావం మాత్రం ౮, ౧౦ రోజులకు అవుతూ ఉంటుంది. ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నా వారిలో తరచుగా వస్తూ ఉంటుంది. కొందరికి గర్భాకోశానికి కంతులు (ఫ్రై బ్రాయిడ్స్) ఉంది బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలూ ఎండో క్రయీన్గ్రంధులు సరిగా పనిచేయక పోవడం వలన కూడా రావచ్చు.

చిట్కాలు:-

1) బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐస్ ముక్కలుగా చేసి దానిని గుడ్డలో పేర్చి, ఆ గుడ్డను పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా ౧౫, ౨౦ నిమిషాలు ఉంచితే సరిపోతుంది (మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది). ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణ లో మార్పు రావడం వల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. ఇలా ౩,౪ సార్లు వేసుకోవచ్చు.

౨) ప్రతి రోజు ౧,౨ నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టి గాని, సిమెంటు తొట్టి గాని ( ౨ అడుగుల ఎత్తు, ౨ అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్లు పోసి పిర్రాలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలడేసి ఉంచాలి. ఆ నెలలో మీ పొట్టి కడుపు భాగం నుండి తొడల వరకు ఉంది మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా ౨౦ నిమిషాల పటు తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.

౩) రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా ౨,౩ నెలలు ప్రయత్నించినా తగ్గాక పోతే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.






24, మార్చి 2008, సోమవారం

కీళ్ళ నెప్పులు తగ్గాలంటే__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

40, 50 సంవత్సారాలు రాక ముందే కీళ్ళ నెప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కీళ్ళ సందుల్లో జిగురు తగ్గిపోయింది, వయసు వల్ల ఎముకలు అరిగి పోయాయి అంటున్నారు. మనం ఏమి తప్పు చేసినందుకు జిగురు పోతున్నదో ఆలోచన చేయకుండా, వయసు మీద మోపుతున్నాము. మన శరీరము 100 సంవత్సరములు పని చేయాడానికి పుడితే 40, 50 సంవత్సరాలకే ఎందుకు పోతాయి. ఏనుగు కూడా ఆయుషు ౧౦౦ సంవత్సరాలే. అంత బరువున్న ఏనుగుకు కీళ్ళనెప్పులు గాని, వాపులు గాని, అరిగిపోవడం గాని, జిగురు తగ్గడం గాని ఎందుకు లేదు? ఏనుగు ఏది తినాలో బాగా తెలుసు. మనకు అన్నీ తినడం తెలుసు. మనం అన్నీ వండి నవి తినడం వల్ల జిగురు తయారయ్యే గుణం, అరుగుదలను నివారించే గుణం శరీరానికి పూర్తిగా నశించి పోతున్నది. పైగా ఆ ఉడికిన వాటిని ఉప్పుతో తినడం వలన ఆ ఎక్కువైనా ఉప్పు కీళ్ళ సందుల్లో పూర్తిగా పేరుకొని ఆ కీల్లను తినివేయడం, కార్టిలేజ్ ను పాడుచేయడం జరుగుతుంది. ఆ శని అనే ఉప్పును తిన్నంత కలం ఎవరికీ కీళ్ళు మళ్ళీ తిరిగి బాగుపడడం అనేది జరగడం లేదు. ఈ ఉప్పును మనకుండా ఎందరో అన్నో రకాల వైధ్యాలను చేయించినా డబ్బులు పోవడమే తప్ప నొప్పులు పూర్తిగా పోయి మామూలు నడక రావడము లేదు. కీళ్ళ నొప్పులు రాకూదదన్నా, పూర్తిగా పూవాలన్న ఉప్పును త్యాగం చేయక తప్పదు.

చిట్కాలు:-
1) ప్రతీ రోజూ ఉదయం కాఫీ లు మాని 7, 8 గంటలకు పచ్చి కూరల రసం త్రాగితే అందులో వుండే సహజ లవణాల వల్ల కీళ్ళ మధ్యలో జిగురు తయారవుతుంది.
2) ఉదయం టిఫిన్ క్రింద మొలకెత్తిన గింజలను తప్పని సరిగా తినాలి. అందులూ నువ్వుల ఉండను తింటే కీళ్ళ అరుగుదలను నివారిస్తాయి.
3) మధ్యాహ్నం, సాయంకాలం భోజనంలో ఉప్పును పూర్తిగా మాని వండుకుని, ఆ కూరలను గోధుమ రొట్టెలలో పెట్టుకుని తినాలి. సాయం కాలం రొట్టె లలో ఉడికిన కూర కంటే పచ్చి కూరను తింటే మరీ మంచిది.
4) మోకాళ్ళకు నువ్వులనూనె రాసి, వేడి నీటి కాపడం 15 నిమిషాల పాటు పెట్టికుని, ఆ తరువాత మో కాళ్ళపై తడిపిన నల్లటి మట్టి (ఒండ్రు) వేసి పైన గుడ్డ చుట్టి ౧౫, ౨౦ నిమిషాలు ఉంచుకుని కడిగి వేస్తే ఉపసమనం వస్తుంది. ఒండ్రు మట్టి లేని వారు తడి గుడ్డ చుట్టుకొని ఉంచుకోవచ్చు. పైన చెప్పినట్లు చేస్తే 2,3 నెలల్లో తగ్గుతాయి. ఎవరికైతే నొప్పులు వాచి 5, 6 సంవత్సరాలు దాటుతుందో వారికి మాత్రం చాల టైము పడుతుంది. ముదిరితే ఇలా చేసినా ఫలితం రాదు. అన్డుచీత కొంచెం ప్రారంభమైనప్పుడే మేలుకుంటే పూర్తిగా పోతాయి.

నీరసం తగ్గాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఈరోజుల్లో ౭౦(డెబ్బై), ౮౦ (ఎనభై) సంవత్సరాల వయసులో ఉన్నా ముసలి వారికి ఉన్నా ఓపిక ౪౦(నలభై), ౫౦ (యాభై) సంవత్సరాల వయసులో ఉన్నవారికి లేదు. ౪౦ (నలభై), ౫౦ (యాభై) సంవత్సారాల వారితూ పోలిస్తే పెల్లీడుకి వచ్చిన పిల్లలకు లేదు. పెళ్లీడు పిల్లలతో పోలిస్తే చిన్న వయసు పిల్లలు మరీ బలహీనంగా వుంటున్నారు. ఇలా రాను రాను చూస్తూ ఉంటే భవిష్యత్తు లో తినే ఓపిక కూడా లేక తిని పెట్టు అనే రోజులు రాబోతున్నాయి. దీనికి కారణం బలం లేని ఆహరం తినడం. రుచికి తింటున్నారే గాని బలానికి, ఆరోగ్యానికి కాదు. రూజుకి ౧౫ (పదిహేను), ౧౮ (పద్దెనిమిది) గంటలు పనిచేసినా ఓపిక తగ్గకూడదంటే

చిట్కాలు :--

౧) అన్నింటికంటే ఎక్కువ బలమైన ఆహరం కొబ్బరి. రోజుకి ఒక పచ్చి కొబ్బరికాయను పూర్తిగా ఉదయం పూట టిఫిన్ లాగ తింటే (మొలకేత్తిన విత్తనాల తో పాటు) మంచిది.

౨) ఖర్జూరం పండు చాల ఎక్కువ శక్తిని తక్కువ టైములో అందిచ గలదు. రూజుకి ౨౦ (ఇరవై) ఖర్జూరం పండ్లను ఉదయం కొబ్బరితోగాని సాయం కాలం పండ్ల తో గాని కలిపి తింటే లాభం చాల త్వరగా వస్తుంది.

౩) ముడి బియ్యం అన్నం వండుకుని రెండు పూటలా తింటే ౧౦ (పది), ౧౫ (పదిహఏను) రోజులలోనే ఓపిక పెరుగుతుంది.

ఈ మూడు విషయాలు ఆచరిస్తే ఒక నెలలోనే పూర్తిగా ఒపికను, బలాన్ని సంపా దించు కోవచ్చు.

౪) ఎప్పుడన్నా ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్లు తిరిగితే అలాంటప్పుడు వెంటనే శక్తి కొరకు తేనెను ౩ (మూడు), ౪ (నాలుగు) స్పూన్లు తీసుకుని మెల్లమెల్లగా నాకుతుంటే, ౫ (ఐదు), ౧౦ (పది) నిమిశాములలో (minutes) లో ఓపిక వచేస్తుంది.

17, మార్చి 2008, సోమవారం

సూక్తులు ____ ౧

౧. విసుగుదల నుంచి విముక్తి కోసం పురుషుడు పెళ్లి చేసుకుంటే , స్త్రీ ఆసక్తి కొద్ది పెళ్లి చేసుకుంటుంది. అందుకీ వాళ్ళిద్దరూ వివాహిక జీవితం లో నిరాశ పడుతుంటారు.___ ఆస్కార్ వైల్డ్
౨. లోకులు తొందరగా నిందిస్తారు లేదాతొందరగా అభినందిస్తారు అందుచేత ఇతరులు నిన్ను గురుంచి అనుకునే మాటలకు పెద్దగ విలువ ఇవ్వవద్దు. __ రామకృష్ణ పరమహింస
౩. నొప్పి ఉన్నపన్ను ఊడ బెరుకుట మేలు. మూర్ఖుడైన మిత్రుని పోగొట్టు కొనుట ఉత్తమము.__ బక్సటర్
౪. మానవుని కష్టాలన్నీ టికి కారణం అతని అజ్ఞానం, క్రమశిక్షణ రాహిత్యం.__ కౌటిల్యుడు
౫. మనలో ప్రశాంతతను కనుగోనలేని పక్షంలో దాని కోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్థం __ లరోచేఫౌకల్దే
౬. సందర్భోచితమైన మౌనం మాటల కంటే ఎక్కువ వాగ్దాటిని గలిగి వుంటుంది.
౭. మీ కష్టాలను ఇతరులతో ఏకరువు పెట్టుకోకండి. చాలామంది వాటిని పట్టించుకోరు. మిగితా వారు మీకష్టాలను విని సంతోషిస్తారు.
౮. గొప్పవారు లేనిదే మనం ఎ గోప్పదాన్నిసాధించలేము. తాము గొప్ప వారం కావాలని నిర్నయిన్చుకున్నప్పుడే మనుషులు గొప్పవారౌతారు__ చార్లెస్ దిగాలే ..
౯. పెద్ద పెద్ద విషయాలకు సంభందించిన ప్రనాలికను తయారు చేసుకోవడం కంటే చిన్న చిన్న విషయాలకు తాయారు చేయడం మెరుగైనది.
౧౦. చిరకాలం నిలిచిపోయే పనులపై జీవితాన్ని వేచ్చించడమే పరమ ప్రయోజనం అవుతుంది.__ విల్లియం జేమ్స్.