1, ఏప్రిల్ 2008, మంగళవారం

కడుపు నొప్పి తగ్గాలంటే__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కడుపు నొప్పి వస్తే నొప్పికి మాత్ర వేసుకుని నొప్పిని పూర్తిగా తగ్గించుకొని, కడుపుని వదిలి వీస్తారు. దానితో మరలా మరలా వస్తూ ఉంటుంది. ముఖ్యముగా పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం బాగా ఉనవారిలో ఈ సమస్య ఉంటుంది. కారణాలు చూస్తే, పొట్ట నిండా భోజనం తిన్న తరువాత, ఈ బరువు వెళ్లి మలం ప్రేగులపై పడితే ఆ ఒత్తిడికి నొప్పి కొందరికి తిన్నాక వస్తుంది. విరేచనం అయ్యాక, అది పూర్తిగా కాక నొప్పి వస్తుంది. ప్రేగులలో బంక బాగా ఉన్నప్పుడు అది కదిలేతప్పుడు నొప్పి కలుగావచు. ప్రేగులలో గ్యాసు పట్టేసి కడుపు నొప్పి రావచు. అసలు విరేచనం రాక ప్రేగులు బిగదీసి ఇంకొందరికి రావచు. ఏ కారణాల చేత వచ్చినా మనకు నొప్పి తగ్గాలి, నొప్పికి మూలమైన మలమూ పోవాలి.
చిట్కాలు:-
౧) ఎప్పుడూ నొప్పిగా ఉన్నా ఆ నొప్పి భాగంపై నూనె రాసి వేడి నీటి బ్యాగ్ కాపడం రోజుకి 2,3సార్లు పెట్టుకోవచు.
౨) ఎనిమాని రెండుపూటలా 2,3 రోజుల పాటు చేస్తే ప్రేగులలో మలం అంతా పోతుంది.
౩) అన్నం కూరలు పెట్టడం మని పళ్ల రసాలు, పండ్లు, మజ్జిగ కొబ్బరి నెలలు, తేనే నెలలు, మంచి నీళ్లు మొదలగు ద్రవాహారాలతో రెండు రోజులుంచండి మంచిది.
౪) రోజూ రెండు పూటలా ఎనిమాకి ముందు పొత్తి కడుపు ఫై తడిగుడ్డ లేదా మట్టిపట్టీ గాని 20 నిమిషాలు ఉంచి తీసివేస్తే మలం బాగా కదులుతుంది.
౫) మలబద్దకం మళ్ళీ మళ్ళీ రాకుండా ఆహారం తిని, నీళ్లు బాగా తాగి రోజుకు 2,3, సార్లు విరేచనం ఐతే ఇక నొప్పిరాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి