1, ఏప్రిల్ 2008, మంగళవారం

శుభోదయం__ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

మన పూర్వీకులు ఆచరించిన మంచి ఆహారపు అలవాట్లను, మన ఇప్పటి ఆహారపు అలవాట్లను పరిశీలిద్దాం.
ప్రాతః కాలం లో నిద్ర లేస్తే ఆరోగ్యానికి మంచిదంటారు పెద్దలు. పడుకునేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. ఇక తెల్లవారుజామున లేవాలంటే ఏమి లేవగలరు? పెద్దలు ఆ వాతావరణం ఎంత మంచిదన్న ఏమి చేయగలరు ? వ్యాపారాలు, ఉద్యోగాలు జీవితానికి తప్పవు గదా ! రాత్రి పూట ఐతే నలుగురూ చేరడానికి, కలవడానికి వీలుంటుంది. మేము ఉద్యోగస్తులముమెందలకడనే ఇంటికి చేరాలంటే ఎలా కుదురుతుంది అంటారు? అందుచేత ఉదయం లేచేసరికే పావు ప్రొద్దు గడిచిపోతుంది. లేవగానే పాచిముఖాన్నే బెడ్ కాఫీలు, టీలు కావలనిపిస్తుంది. నిద్రాలో శరీరం చెడులు విసర్జించే కార్యక్రమం లో వుంటుంది. నిద్ర నుంచి మేలుకున్న తరువాత కూడా అదే పని కొనసాగుతూ వుంటుంది. నిద్రలేచిన వెంటనే మన నరాల శక్తి ఎక్కువ పెద్ద ప్రేగులామీద పనిచేస్తూ వుంటుంది. ఎందువల్లనంటే శరీరం లో ఎక్కువ వ్యర్ధ పదార్ధం అక్కడే నిలువ వుంటుంది. కాబట్టి రాత్రంతా అక్కడకు నెత్తిన చెడును బయటకు పంపించే వరకు మనస్సుకు విశ్రాంతి ఉండదు. అంటే రాత్రి అంతా చిన్న ప్రేగులలో, పొట్టలో ఉన్నా చెడును, విసర్జక పదార్దాలన్నింటినీ, మలశాయానికి చేర్చి ఉంచుతుంది. మనం నిద్ర లేచిన వెంటనే పనులు ఏమీ చీయకుండా వుంటే, మనలోని శక్తి అంతా సాఫీగా విరోచనము అయ్యేటట్లు సహకరిస్తుంది. అలా కాకుండా, మనం లేచిన వెంటనే, విరోచనం కాక ముందే బెడ్ కాఫీ తగుతామనుకోండి, మనలోని శక్తి మలం ఉన్నా ప్రేగు నుండి వెంటనే పొట్టలోకి వచేస్తుంది. మరి కాఫీని జీర్ణం చీయడానికి శక్తి కావాలి కదా. విరోచనం సంగతి తరువాత అని పోత్తపని ముందు చీపడుతుంది. నిద్రలేచిన దగ్గర నుండి మనము ఏదో ఒక టిఫిన్ తినే వరకు ఇంకా విసర్జించే పనిలో వుంటుంది.
ఉదయం పూట సూర్యుడి వీడి కిరణాలు ప్రారంభమయ్యే దగ్గర నుండి చెడును విసర్జించే కార్యక్రమం తగ్గుముఖం పడుతూ వుంటుంది. సూర్యుడి వేడి పెరిగే కొద్దీ ఆకలి పెరుగుతూ ఉంటుంది. సూర్య కిరణాలు వేదేక్కడం ప్రారంబించిన దగ్గర నుండి మనం తినడం ప్రారంభించవచ్చు. మనం ౮ లేచామనుకోండి, లేచిన తరువాత జరుగవలసిన విసర్జనకు అవకాసం ఉండదు. అప్పుడే ౮ గంటలు ఐఏపొయిన్ధిఅని, వెంటనే ముఖం కదిగీసుకుని టిఫిన్ తినడం జరిగుతుంది. అదీ తెల్లవారుజామున ౪,౫ గంటలకు లేచామనుకోండి, మన పూర్వీకులకులాగా ఎక్కువ సమయం సుమారు ౨,౩ గంటలు టిఫిన్ తినే ముందు పొట్ట ఖాళీగా వుంటుంది. ఆ సమయంలో శరీరం చెడును విసర్జించడానికి ఎంతో ముధ్యమైనది. తెల్లవారు జామున లేచిన వెంటనే నీరు త్రాగి మల విసర్జన చేస్తే చాలావరకు తేలిక అనిపిస్తుంది. ఆ తరువాత శారీరక శ్రమ గానీ, లెదా యోగాసనములు ప్రాణాయామం లాంటివి కూడా రాత్రి కదిలిన చెడును విసర్జక అవయవాల ద్వారా బయటకు పంపడానికి అవసరం. అదీ విధంగా నీరు ఒక లీటరుకు పైగా త్రాగడం వలన రక్తంలోనికి వచిన చెడు, కనాలలో రాత్రి సమయంలో కదిలిన చెడు, ఈ నీటిలోనికి వాచి అది చెమట, మల మూత్రాల ద్వారా బయటకు విసర్జించబడుతుంది. మరల ఇంకొక లీటరు నీటిని త్రాగి చెడును విసర్జించే కార్యక్రమంలో శరీరానికి సహకరించాలి. ఇలా నిద్ర లేచిన తరువాత ౨,౩, గంటలు శరీరానికి నీటిని తప్ప వేరే పదార్ధం ఇవ్వకుండా శారీరక వ్యాయామం చేస్తూ వుంటే అప్పుడు శరీరం దాని ధర్మాన్ని అది (విసర్జించడం) పూర్తిగా నెరవేరుస్తుంది. ఇది మన ఆరోగ్యానికి శుభోదయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి