31, మార్చి 2008, సోమవారం

కంటి చూపు పెరగాలంటే __ మంతెన సత్యనారాయణ రాజు

కంటి చూపు పెరగాలంటే :-

పూర్వం కంటి చూపు తగ్గితే ఇక అక్కడ నుండీ ముసలి వయస్సు వచినట్లుగా లెక్కవేసుకునేవారుఈ మధ్య బాల్యదశ పూర్తి కాకుండానే కంటి చూపు తగ్గి పోతుంది. కొన్ని జీవులు 400 నుండీ 1000 సంవత్సరాల వరకు జీవించేవి ఉన్నవి. అంతకాలం జీవించినా ఏ జీవికి ఇంత వరకు కళ్ళజోడు అవసరం తెలియకుండానే జీవించగలుగుతున్నాయి. అన్నీ ఉడికించి, వార్చి, మాడ్చి, అందులో ఉప్పు, నూనెలు కలుపుకుని తినే సరికి, కంటి అవసరాలు ఆహరం ద్వారా తీరడం లేదు. ప్రకృతిలో పచ్చదనాన్ని చూసి విశ్రాంతి పొందవలసింది పోయి జిగేలు మనే రంగు రంగుల బొమ్మలు చూసేసరికి శుబ్రంగా చెడిపోతున్నాయిదీనికి పరిష్కార మార్గం, మళ్ళీ సహజంగా జీవించడమే.

చిట్కాలు:-
౧) ప్రతీ రోజూ ఉదయం క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుని పచ్చికూరాల రసం త్రాగాలి.
౨) అవకాసమున్న వారూ మునగ ఆకుని రోజూకొంత పచికూరాల రసం లో వేసుకుని త్రాగితే మంచిది. లీద వారానికి 1,2, రోజులు విడిగా మునగ ఆకు రసాన్ని తీసి దీనిలో నీరు ఎక్కువగా కలిపి, తేనే, నిమ్మ రసం కలుపుకొని త్రగాగాలిగినా మంచిదే.
౩) రోజూ మద్యాహ్నం భోజనంలో ఆకుకూరాలను తప్పనిసరిగా వండుకుని తినాలి.
౪) అవకాశముంది దొడ్డిలో ఆకుకూరాలను స్వయముగా పండించుకున్నవి అయితే పచికూరాల రసం లో రోజూ ఆకుకూరాలను వేసుకుని త్రాగితే మరీ మంచిది.
౫) ఏకాలం లో దొరికితే పండ్లను ఆ కాలంలో రూజుకి 20 శతమన్న తినాలి.
౬) ఉప్పును ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఆ ఉప్పు వల్ల కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు తొందరగా పాడైపోతున్నై.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి