24, మార్చి 2008, సోమవారం

నీరసం తగ్గాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఈరోజుల్లో ౭౦(డెబ్బై), ౮౦ (ఎనభై) సంవత్సరాల వయసులో ఉన్నా ముసలి వారికి ఉన్నా ఓపిక ౪౦(నలభై), ౫౦ (యాభై) సంవత్సరాల వయసులో ఉన్నవారికి లేదు. ౪౦ (నలభై), ౫౦ (యాభై) సంవత్సారాల వారితూ పోలిస్తే పెల్లీడుకి వచ్చిన పిల్లలకు లేదు. పెళ్లీడు పిల్లలతో పోలిస్తే చిన్న వయసు పిల్లలు మరీ బలహీనంగా వుంటున్నారు. ఇలా రాను రాను చూస్తూ ఉంటే భవిష్యత్తు లో తినే ఓపిక కూడా లేక తిని పెట్టు అనే రోజులు రాబోతున్నాయి. దీనికి కారణం బలం లేని ఆహరం తినడం. రుచికి తింటున్నారే గాని బలానికి, ఆరోగ్యానికి కాదు. రూజుకి ౧౫ (పదిహేను), ౧౮ (పద్దెనిమిది) గంటలు పనిచేసినా ఓపిక తగ్గకూడదంటే

చిట్కాలు :--

౧) అన్నింటికంటే ఎక్కువ బలమైన ఆహరం కొబ్బరి. రోజుకి ఒక పచ్చి కొబ్బరికాయను పూర్తిగా ఉదయం పూట టిఫిన్ లాగ తింటే (మొలకేత్తిన విత్తనాల తో పాటు) మంచిది.

౨) ఖర్జూరం పండు చాల ఎక్కువ శక్తిని తక్కువ టైములో అందిచ గలదు. రూజుకి ౨౦ (ఇరవై) ఖర్జూరం పండ్లను ఉదయం కొబ్బరితోగాని సాయం కాలం పండ్ల తో గాని కలిపి తింటే లాభం చాల త్వరగా వస్తుంది.

౩) ముడి బియ్యం అన్నం వండుకుని రెండు పూటలా తింటే ౧౦ (పది), ౧౫ (పదిహఏను) రోజులలోనే ఓపిక పెరుగుతుంది.

ఈ మూడు విషయాలు ఆచరిస్తే ఒక నెలలోనే పూర్తిగా ఒపికను, బలాన్ని సంపా దించు కోవచ్చు.

౪) ఎప్పుడన్నా ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్లు తిరిగితే అలాంటప్పుడు వెంటనే శక్తి కొరకు తేనెను ౩ (మూడు), ౪ (నాలుగు) స్పూన్లు తీసుకుని మెల్లమెల్లగా నాకుతుంటే, ౫ (ఐదు), ౧౦ (పది) నిమిశాములలో (minutes) లో ఓపిక వచేస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి