జీర్ణ క్రియలో దోషాల వలన ఎక్కువగా వికారం వస్తుంది. నిద్ర లేచిన వెంటనే ప్రేగులలో పసర్లు ఎక్కువగా వున్నా తిన్నది సరిగా అరగకపోయినా ఆహారం తిని బస్సు, కారు లాంటివి ఎక్కినా, ఆహారంలో సరిపడని విష పదార్ధాలు వున్నా వికారాలు వస్తూ వుంటాయి. వికారం వున్నప్పుడు వాంతి అయితే బాగున్తుందనిపిస్తుంది. ఈ లోపు కళ్ళు కూడా తిరుగుతూ కుదురు లేనట్లు వుంటుంది. వాంతి వచ్చినట్లుంటుంది కానీ వాంతి రాదు. వాంతి అయితే బాగుంటుందని ఆందరికీ అనిపించినా వాంతి చేసుకోవాలనే ఆలోచన పట్టాడు. వికారం ముదిరితే కానీ వాంతి అవదు. వాంతి ఐతీ కానీ తిక్క తగ్గదు.
చిట్కాలు:
1 . అవకాశం వుంటే గోరువెచ్చని నీరు, లేనప్పుడు బిందెలో నీరు 5, 6 గ్లాసులు గ్లాసులు (ఉప్పు కలపకుండా) ఆపకుండా త్రాగండి. ఇంకా త్రాగ గలిగితే త్రాగండి. నీరు త్రాగుతుంటే వికారం ముదరాలి. త్రాగేతప్పుడే వాంతి వచ్చేటట్లు త్రాగండి. త్రాగాలేనప్పుడు ఆపి వ్రేళ్ళను నోటిలో పెట్టి వాంతి చేసుకోండి. మనము త్రాగిన నీళ్ళు వెళ్లి లోపల వున్నా దోషాన్ని పట్టుకొని బయటకు వచేస్తాయి. పొట్టలో ఆహరం వున్నా సరే ఎప్పుడు వికారం వుంటే అప్పుడు ఇలా వాంతి చేసుకోవచ్చు. వెంటనే ఏమి తినకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని తేనె నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు కాని త్రాగితే హాయిగా వుంటుంది...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి