1, మే 2010, శనివారం

భక్త యోగి - కర్మ యోగి

బాటసారులు దాహం తీర్చుకోవటానికి ఎవరో మహానుభావులు ఊరికి దగ్గరగా ఒక చెరువు తవ్వించారు.  దాని గట్టునే పెద్ద రావి చెట్టు ఉంది.  అలసి పోయిన బాటసారులు ఆ చెరువులో నీరు తాగి చెట్టు దగ్గర బండ మీద కాసేపు విశ్రమించి వెళ్ళేవారు.  ఆ అరుగు మీద ఒక గ్రామస్థుడు కూర్చుని ఉన్నాడు.  ఎందుకోగానీ మొహం బాగా విసుగ్గా పెట్టుకుని, తనలో తనే ఏదో గొణుక్కుంటూ ఉన్నాడు.   ఆ మార్గంలో వెళ్తున్న ఒకాయన ఏవో పదాలు పాడుకుంటూ ఏక తారా మీటుతూ అటువైపు వచ్చాడు.  ఆయనకు అక్కడ కాసేపు విస్రమించాలని అనిపించింది.  అక్కడే కూర్చుని ద్యానం చేసుకుంటున్నాడు.  ఇంతలో గ్రామంలోనుంచి కొందరు ఆకతాయి పిల్లలు గోల గోలగా అరుస్తూ వచ్చారు.  ఒక తేలుకు దారం కట్టి గిరగిరా తిప్పుతూ ఆనందిస్తున్నారు.  కాసేపటికి వాళ్ళకు దాని మీద ఆసక్తి తగ్గింది.  దాన్ని చెరువులోకి విసిరేసి, ఎవరి దారిన వారు ఇళ్ళకు వెళ్లి పోయారు. 

***
ఇదంతా గమనిస్తున్న ఆ భక్తుడు ఒక ఆకును తీసుకుని, చెరువు గట్టు దగ్గరికెళ్ళి  దాన్ని తేలు దగ్గరగా పెట్టాడు.  అది నెమ్మదిగా ఆకు మీదకు ఎక్కింది.  దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి రక్షిత ప్రాంతంలో వదలాలి అనేది ఆయన సంకల్పం.  కాని, అది ఆయనను కుట్టింది.  ఆ కదలిక వాళ్ళ మళ్ళీ చెరువులో పడింది.  ఆయన మళ్ళీ దాన్ని ఆకు మీదకు రానిచ్చి రెండు అడుగులు వేసాడు.   అది మళ్ళీ ఆయనను కొండితో కుట్టి కదలికకు చెరువులో పడి పోయింది.  ఇట్లా ఆయన దాన్ని ఆకు మీదకు ఎక్కించి రక్షించటం, అది ఆయనను కుట్టి చెరువులో పడటం ఐదుసార్లు జరిగింది.  చెట్టు కింద కూర్చున్న ఆసామికి ఆయన మీద కోపం వచ్చింది.  'ఏమిటి స్వామీ, అది విష కీటకం.  తేలుకు కొండిలో విషం ఉంటుందంటారు.  మీరేమో దాన్ని రక్షిస్తున్నారు.  అదేమో మిమ్మల్ని కుడుతూనే ఉంది.  మీ ప్రవర్తన నాకేం అర్ధం కావటం లేదు... చూడటానికి మీరు జ్ఞానుల్లా ఉన్నారు.  ఇదేమి పని?  అని ఆయన్ని మందలిస్తున్నట్లు విసుగ్గా, కోపంగా, కటువుగా కసురుకున్నాడు.  దానికి ఆ భక్తుడు 'నాయనా ! నా విధి నేను నిర్వర్తిస్తున్నాను.  ఆపదలో ఉన్న జీవిని రక్షించడం మనిషి కనీస ధర్మం.  దాని విధి అది నిర్వర్తిస్తుంది.  కొండితో కుట్టడం దాని లక్షణం.  పైగా నేను రక్షిస్తున్నట్లు దానికి తెలీదు.  అది ఆకు మీద స్థిరంగా ఉన్నప్పుడు... దాన్ని ఆ రాతిగుట్ట దగ్గర పెట్టి, నా దారిన నేను పోతాను' అని నిదానంగా చెప్పాడు.  మరి అది ప్రతిసారీ మీ చేతిని కుడుతోంది కదా.  మీకు కష్టంగా లేదా?  పైగా అన్నిసార్లు దాని కోసం ప్రయాసపడటం, మీకు విసుగానిపించడం లేదా?  అని అడిగాడు ఆ గ్రామస్థుడు.  అతనడిగిన ప్రశ్నకీ, అతని అమాయకత్వానికీ ఆ భక్తుడికి నవ్వొచింది.
***
'నాయనా, నీవెవరో నాకు తెలుయదు.  రూపాన్ని బట్టి రైతులా వున్నావు.  విధి నిర్వహణలో కష్టం, విసుగు అనే మాటలకు తావుండదు.  ఆ రెండూ నీ లక్ష్యానికి అడ్డు వస్తాయి.  ఎంత కష్టమైనా మన పని మనం చెయ్యాలి.  చేసే పని మీద మనకెప్పుడూ విసుగు రాకూడదు.  అది ధర్మ సూక్షం.  అర్ధం చేసుకుంటే నీకే బోధపడుతుంది' అన్నాడాయన.
***
ఈలోగా ఆ తేలు ఆకు మీదనుంచి కిందపడి గబా గబా ఎటో వెళ్ళిపోయింది.  ఆయన సంతోషించాడు.
***
ఆ రైతు ఆ భక్తుడిని గౌరవ భావంతో చూస్తూ నమస్కరించాడు.  ఆయన ఎకతారా తీసుకుని బయలుదేరబోతున్నాడు.  తన సమస్యకు పరిష్కారం ఆయన చెప్పగలడని నమ్మకం  కలిగింది.
***
'స్వామీ! నా పేరు భూపతి.  నేనొక రైతుని.  వర్షాలు లేక, చీడల పీడల వల్ల పంటలు  పండటం లేదు.  పడ్డ శ్రమంతా వృధా అవుతోంది.  కష్టపడి సంపాదించినన్నాళ్ళు ఎంతో గౌరవంగా చూసే భార్యా పిల్లలు- నన్ను చులకనగా చూస్తూ విసుక్కుంటున్నారు.  అందుకని ఇంటి మీద అలిగి, ఈ బొద్దు రాయి దగ్గరికి వచ్చి కూర్చున్నాను.. మీరు జ్ఞానులు... మీ మాటలు ఎంతో  ధైర్యాన్నిచ్చాయి.  నాకు ధర్మం తెలిసింది...' అన్నాడు.
***
'నాయనా కాలం ఎప్పుడూ ఒక రకంగానే వుండదు.  ఒక్క ఏడాది పంటలు పండకపోతేనే నిరుత్సాహపడి కోపం తెచ్చుకోకూడదు.  వ్యవసాయం నీ ధర్మం.  ఈ సంవత్సరం వర్షాలు సంవృద్దిగా కురుస్తాయి.  పంటలు పుష్కలంగా పండుతాయి.  మీ గాదెలు నిండుతాయి.  నీ పనిని విసుగు లేకుండా చేయి.  ఫలితం బాగుంటుంది.  సమర్దుడివి అని నిరూపించుకో.  ధన హీనుడిని ఎవ్వరూ గౌరవించారు.  అది లోక ధర్మం.  నిన్ను నిరసించిన వారే మళ్ళీ నిన్ను గౌరవిస్తారు` అని బోధించి బయలు దేరారు ఆయన.  'స్వామీ... మీ పేరు?' " నాకంటూ పేరు లేదు. అందరూ నన్ను కబీరు అంటారు...' అని ఎకతారా మీటుకుంటూ ఆయన నిష్క్రమించారు....  రాదా మనోహర్...

21, నవంబర్ 2009, శనివారం

ఏది సరైన చికిత్స __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

నేడు వైద్య విధానం ఎంతో అభివృద్ది చెందింది. ఇంకా ఎంతో చెందాలి. అది ఈ సమాజానికి చాలా అవసరం. మానవుని మీలు కోరి ఎందరో మహానుభావులు ఎన్నోరకాల వైద్య విధానాలు రూపొందించారు. అవి, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, యునాని మొదలగునవి. ఇవన్ని మనిషికి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాయి. బాధ తో వెళ్ళిన మనకు ఎంతో ఉపసమానాన్నిసుఖాన్ని కలిగిస్తున్నాయి. మనకొచ్చిన సమస్యకు ఎ వైద్య విధానము పాటించినా దానివల్ల మనకు పూర్తి లాభం రావచ్చులేదాకొంత వరకే ఉపసమనం కలుగవచ్చులేదా అసలు కొంచెం కూడా తగ్గకపోవచ్చు. ఒకసారి తగ్గకపోగా దుష్ఫలితాలైన రావచ్చు. ఏ లాభాన్నిచ్చినా సరే, మనకు ఏదైనా జబ్బు వచ్చాకే అవి అవసరమవుతున్నై. జబ్బు రాని వారు ఏ వైద్య విధానం జోలికి పోరు. ఏ జబ్బు రాకుండా అవి మనకు సహకరించలేక పోతున్నై. ఉదాహరణకు కడుపునొప్పి వచ్చాక మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గవచ్చు, మిగితావారికి నొప్పి రాకుండా ముందునుండీ ఆ నొప్పి మాత్ర వేసుకున్దామంటే అది పనిచేయ్యకపోగా హాని చేస్తుంది. వైద్య విధనాలన్నీఇలా ఉంటే, ప్రకృతి వైద్య విధానం మాత్రం వీటన్నిటికి భిన్నం గా పని చీస్తుంది. ఉదాహరణకు కడుపు నొప్పి తగ్గడానికి ఎనిమా చేసి, ప్రేగులను క్లీన్ చేసి, మంచి ఆహరం పెట్టి నొప్పి తగ్గిస్తారు. ఈ చికిత్సా పద్దతిని కడుపునొప్పి లీనివారు, రాకుండా ఇలా ముందు జాగ్రత చర్యగా చేసుకుంటే, వారికి ఆ సమస్య భవిష్యత్ లో రాకుండా ప్రేగులు పరిశుభ్రంగా ఉంటాయి. అంటే ఇక్కడ చేసే ప్రతి చికిత్స కూడా జబ్బు వచ్చిన వారికి ఏది తగ్గించడానికి పనికొస్తుందో, అదే చికిత్స జబ్బు లేని వారికి రాకుండా సహకరిస్తుంది. రెండు పక్కల పదునున్న కత్తి లాంటిందన్న మాట . సరైన చికిత్స అంటే, రాగి చెంబు చిల్లు పడితే రాగిముక్క అతుకు వేయడం ఎంత సరైనదో, ఈ ప్రకృతి సిద్దమైన శరీరానికి ప్రకృతి చికిత్సలు కూడా అంత సరిగా సూటు అవుతాయి. పాలలో పాలు కలుసినట్లుగా, చికిత్స, శరీరం రెండు ఒకటిగా కలసి పోతాయి. వీటి మధ్య ఘర్షణ రాదూ. అంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు. ఇలాంటి ప్రకృతి సహజమైన పద్దతుల ద్వారా మనందిరికీ వచ్చే సాధారణ సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మన శరీరానికి ఏదన్నా సమస్య వస్తే సహజముగా, ప్రకృతి సిద్ధముగా ఆ సమస్యను తగ్గించు కోవడానికి ముందు మనం ప్రయత్నించాలి. అలా చేసినా ఫలితం లభించక సమస్య పెరుగుతూ వుంటే అప్పుడు ఇతర వైద్య విధానాల జోలికి వెళ్ళడం తప్పు కాదు. కాని మనం ముందే వాటిని వాడుకుంటూ శరీరానికి విరుద్దంగా ప్రయత్నిస్తున్నాము. ఇక నుండైనా ఈ శరీరానికి ఏది వచ్చినా ప్రకృతి సిద్దంగా తగ్గించే ప్రయత్నం ప్రారంభిస్తే మనకు ఎక్కువ లాభం జరుగుతుందని ఈ చికిత్సా పద్దతులను వ్రాస్తున్నాను. ఈ ప్రకృతి చికిత్స పద్దతులను కొంతకాలం చేసి ఆపవలసిన పని లేదు. ఎందుకంటే, ఇది మందు కాదు కాబట్టి, జబ్బులున్నా లేకపోయినా, ఇంటిల్లిపాది అందరం ఇలాంటి మంచి అలవాట్లను ఆచరణలో ఉంచుకొని ఆరోగ్యాన్ని బాగు చేసు కొంటారని ఈ ఆర్టికల్స్ వ్రాస్తున్నాను. మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
___
____
జంతువులకు ఏ సమస్య వచ్చినా వెంతనీ ప్రకృతి సిద్దం గా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నై. వికారం గా వుంటే, తనకు గిట్టని ఆహారాన్ని తిని వెంటనే వాంతి చేసుకుని సమస్యను తగ్గించుకుంటాయి. ఆకలి వెయ్యకపోతీ పొట్టను మాడ్చి మళ్ళీ ఆకలి పుట్టే లాగా చేసుకుంటాయి. ఇలా చికిత్స చేసుకోవడం కూడా వాటి జీవితం లో ఒక భాగంగా చేసుకుని బ్రతుకుతాయి. అలా చికిత్స చేసుకోవాలని అవి ఎక్కడ చదువు కోవు , ఎవరి చేత చెప్పించుకోవు. మనకు వచ్చింది కూడా అలాంటి శరీరమే. అలాంటి జన్మే. అయినా వాటికీ లేని తెలివితేటలు, జ్ఞానం అదనం గా మనకు లభించినందుకు వాటి కంటే మనము ఇంకా తెలివిగా ప్రవర్తించి సమస్యలను తేలిగ్గా పోయేట్లు మనకి మనమే ప్రయత్నించాలి. మరి మన శరీరానికి, సహజంగా సమస్యలను తగ్గించే మార్గాలు తెలిసినా చేసుకోలేక పోతే నష్టం మనకే. మన ఇంట్లో ఉండే వాటినుపయోగించుకుంటూ, మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే ఈ సదవకాసాన్ని అందరూ వినియోగించుకుని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోశాలతో, ఆనందం గా జీవించే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను...

గ్యాసు బిగపట్టడం పోవాలంటే __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

కొందరికి గ్యాసు పొత్తి కడుపు భాగంలో బిగపట్టి బయటకు రాదు. ఏమి చేయాలో తూచని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపానవాయువు వస్తే బాగుంతుంధనిపిస్తుంది. అది ఎదురుచూడగా చూడగా ఎప్పటికో ఎన్నో ప్రయత్నాలు చేయగా గాని బయటకు రాదు. అది బయటకు వస్తే ప్రాణం హాయిగా వుంటుంది. అలా గ్యాసు బిగియడానికి కారణాలు చూస్తే ....
౧) ఎక్కువ సేపు ( మూత్రం సంచి నిండే దాకా) ఆపుకోవడం,
౨) నడుముకు బట్టలను టైటుగా బిగించడం,
3)మలద్వారం దాక మలం వచ్చి బిగిసిపోవడం మొదలగునవి.
౪) అలాగే ఛాతీ బాగంలో, పొట్ట భాగంలో గ్యాసు త్రేన్పురూపంలో రాకుండా పట్టేస్తుంది.
౫) త్రేన్చుదామనుకున్నా త్రేన్పు రాదు.
ఇలా గ్యసుపట్టినప్పుడు ఆ గ్యాసు ఫ్రీగా బయటకు రావాలంటే....
చిట్కాలు ()----
౧) ముందు బెల్టు, బట్టలు కాస్తా వదులు చేసుకోవడం మంచిది.
౨) మూత్రం రాకపోయినా వెళ్లి కూర్చుంటే అప్పుడు కొంత గ్యాసు ఆ టైములో బాగా కదిలి బయటకు పోతుంది.
౩) ఫై భాగంలో గ్యాసు పడితే వజ్రాసనం (నడుమును లైనుగా పెట్టి ఎలా కూర్చున్నా ఫరవాలేదు) లో కూర్చుంటే గ్యాసు రిలీజు అవుతుంది.
౪) ఇంకా బిగపట్టి ఉంటే ౫(ఐదు), ౧౦ (పది) సార్లు శ్వాసలను గట్టిగా పీల్చి వదిలితే, ఆ కదలికలకు గ్యాసు బయటకు వస్తుంది.
౫) ఇంకా రాకపోతే, వేడి నీటిని కాఫీలాగా మెల్లగా త్రాగితే ప్రేగులలో ఆ వేడి కదలికలను పెంచి గ్యాసు బయటకు వస్తుంది.
౬) ఇంకా ఇబ్బంది ఉంటే చాతీ ఫై గాని బొడ్డు క్రింద గాని కొంచెం నూనె రాసి వేడినీటి కాపడం పెడితే చాలావరకు వచ్చేస్తుంది. ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ల సలహా ఫై ఏదైనా మందు వాడు కోవచ్చు. పైన చెప్పిన వాటిలో మీకాసమయం లో ఏది అవకాశం ఉంటే దానిని చేసి చూడండి.
------డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు. -

20, నవంబర్ 2009, శుక్రవారం

యద్భావం తద్భావతి__ ఇదే జీవిత మర్మం

జీవితం ఒక రణరంగం అనుకొనే వారికి అదొక "యుద్ద రంగం"----

***
జీవితం ఒక సమస్యల సుడిగుండం అనుకునే వారికి అదొక అంతు చిక్కని "పద్మవ్యూహం"----
***
జీవితాన్ని చూసి భయపడే వారికి అదో పెద్ద పెనుభూతం -------
***
తామరాకు ఫై నీటి బిందువులా జీవితాన్ని భావించే వారికి అదో గీతర్ధ సారం ----
***
జీవితం అంటే ఒక మధుర స్వప్నం అనుకునే వారికి అదొక "భూలోక స్వర్గం "
***
"యద్భావం తద్భావతి " అన్న రీతిగా ఉంటుంది--- జీవితం
***
ఇక్కడ మీకో చిన్న కధ చెప్పాలి ....
***
ఒక రోజు ఒక చాకలివాని బట్టలు మోసే గాడిద పొరపాటున కాలుజారి, ఆ ఊరి వెలుపలి పాడుపడిన బావిలో పడింది. ఎత్తు నుంచి పడటంతో దాని నడుము విరిగిపోయినంత పని అయ్యింది. దీనితో స్ప్రుహ తప్పి సొమ్మ సిల్లి అలా ఆ బావిలోనే ఉంది పోయింది. సాయంత్రానికల్లా ఇంటికి రావలసిన గాడిద రాక పోవడంతో చాకలి దిగులుతో తన గాడిద కోసం ఊరు వాడ అంతా గాలింపు ప్రారంభించి... సాయం సమయానికి... నీరు లేని, వాడుకలో లేని ఊరు వెలుపలి దిగుడు బావిలో తన గాడిద పడిపోయి ఉండడాన్ని గమనించి, అది చనిపోయిందని భావించి అదే బావిలో మరో మనిషో, మరో జంతువో పది ప్రాణాలు కోల్పోకుండా తన ప్రియమైన గాడిదను బలిగొన్న ఆ బావిని పూడ్చి వేయాలని నిశ్చయించుకొని ఆ పనీదో ఆ రాత్రికి రాత్రే చెయాలని నిర్ణయించి అప్పటికప్పుడు ఊరివారి సాయంతో పది బల్ల మట్టి తెప్పించి ఆ రాత్రి తనతో పాటు మరో ఇరువురు కలిసి మట్టిని బావిలో పరలతో నెడుతూ బావి పూడ్చడం ఆరంబించారు. అంత ఎత్తునుండి మట్టి తన ఒంటి పై పడటంతో గాడిదకు తెలివి వచ్చింది. జరుగుతుందేమితో, జరగబోయేదేమిటో దానికి అర్ధమైపోయింది. అది తెలివిగా పై నుండి మట్టి బావిలోకి పది అది తన వంటిపై పడినప్పుడల్లా తన ఒంటిని విదిలించడం మొదలు పెట్టింది. ఫలితంగా తెల్లవారే సరికి బావైతే మట్టితో మునిగిపోయింది కానీ ఆ మట్టిలో గాడిద సమాధి కాలేదు. తోక ఊపుకుంటూ ఆ మట్టితో పాటు పైకి వచ్చేసింది.
***
ఈ కధలోని మర్మం గుర్తించగలిగితే మన "జీవితం" మహాత్తరంగా మారిపోతుంది.
***
"జీవితం" లో కష్టాలు బావిలో ఉన్నా గాదిధపై పడిన తట్టల తట్టల మట్టిలా మనపై పడటం మనల్ని నొప్పించడం అతిసహజంగానే జరిగుతూనే ఉంటుంది. వాటి కారణంగా మనం అటు శారీరకంగా ఇటు మానసికంగా క్రున్గిపోయామా వాటిలో మన జీవితం సమాధి అయిపోవడం తద్యం.
***
కష్టాలు, నష్టాలు, భాధలు కన్నీళ్లు కట్ట కట్టుకొని, చుట్ట చుట్టుకొని సుడిగుండాల్లా మనల్ని చుట్టుముట్టినా సరే సింహం జూలు విదిలించినట్లు ఒక్కసారి విదిలించి వీసి చిరుతపులిలా జీవించడంలో ముందుకు దూసుకు పోవాలి. అలా దూసుకుపోయిననాడు ఏదో ఒక నాటికి మీరనుకున్నది సాధించగల్గుతారు

***
ఇందుకు మీరు సిద్దం కావాలన్నమీ మనసును సిద్దం చెయ్యాలన్నా మీరు కొన్ని నియమాలు పాటించక తప్పదు......
***
౧) మీలోని భయాలను తొలగించుకోండి.
౨) అవి ఏ రూపంలో ఉన్నా వాటినుండి బయటపడే ప్రయత్నం చెయ్యండి.
౩) పలురకాల ఆందోళనలు మిమ్మల్ని తరచూ వర్రీ చేస్తుంటాయి. ఏ వర్రీ మిమ్మల్ని ఎంతగా వర్రీ చేసినా మీరు వర్రీ అయిపోకండి. ఆ వర్రీలన్నీ ఒక డైరీలో వ్రాసుకోవడం అలవాటు చేసుకోండి.
***
కొన్ని రోజుల తరువాత ఆ డైరీ చదివితే అనవసరమైన విషయాలకు అనవసరంగా ఇంతకాలం వర్రీ అయిపోయామని మీరే గ్రహిస్తారు. " అసూయా ద్వేషాలకు అతీతంగా జీవించండి.
***
మీ జీవితంలో జరిగిన సుఖాలను, మంచినీ మరీ మరీ తలచుకొని ఆనందించండి.
***
కష్టాలను, నష్టాలను, అవమానాలను, అవహేలనలను అప్పటికప్పుడే మరిచిపోయే ప్రయత్నం చెయ్యండి. అవి తీపి జ్ఞాపకాలు కావు మరల మరల గుర్తు తెచ్చుకునేందుకు.
***
పల్లీలు తింటూ ఆనందించే (సమయంలో ) తరుణంలో చెడు పప్పు తగిలితే వెంటనే తుపుక్కున ఊసేసి ఎలా అయితే చెడు రుచిని నోటి నుంచి దూరం చెయ్యడానికి మంచి పల్లీలు తింటారో అలానే జీవితంలో చెడు అనుభవాలను ఆ క్షణంలో చెడు అనుభవాలను ఆ క్షణంలోనే మీలోంచి తుదిచేయండి. మరలా జీవితంలోకి తీపిని ఆహ్వానించండి.
***

మీ కోపం ఎలా వుండాలి __ స్వామి సుఖబోధానంద ...

" తన కోపమే తన శత్రువు " అన్నది శతకకారుడి అప్తవాక్యం. నవరసాల్లో రౌద్రానికి స్థానం వుంది. రౌద్ర రసం అంటే ఆగ్రహంలోని శక్తి. ఆ శక్తిని సంతరించుకోవాలంటే మనిషికి కోపం వుండాలి మరి. అలాగని అస్తమానం కారాలు, మిరియాలు నూరమని కాదు. ఆరోగ్యకరమైన కోపం మనిషికి చాలా అవసరం. గాంధీజీ కోపాన్ని అహింసా పథం లో నడిపించారు. దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు కూడా! ఆరోగ్యకరమైన ఆగ్రహం జీవితాన్ని ప్రయోజనకరంగా మలుస్తుంది. అదే అనారోగ్యకరమైన కోపం బతుకును చిందరవందర చేస్తుంది. మనిషిలో కోపం లేకపోయినా ఇబ్బందే. అందరికి లోకువై పోతాడు. శ్రీ కృష్ణుడి అన్నబలరాముడు ఒక సారి తన తమ్ముడితో ఇలా అన్నాడు. ఏమిటిది కృష్ణ, నీకు నీకు అణిగిమణిగి ఉండేవాళ్ళు నీపట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తుంటే నీకు కోపం రావడం లేదేం? ఆ మాటలకు కృష్ణుడు నవ్వాడు --" నా కోపాన్ని కోడా నువ్వే తీసుకున్నావు కదా .... నాకు అగ్రహించే అవకాసం ఎక్కడఉంది అన్నయ్యా ? అంటూ చమత్కరించాడు. అది బలరాముడి కోపాన్ని రెట్టింపు చేసింది. అప్పుడు కృష్ణుడు--"నాకూ కోపం వుంది "..
-----
కాని నా కోపానికి, నా ఆగ్రహానికి తేడా ఉంది. నాలోని కోపానికి కళ్లు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, హృదయం ఉంది. అందువల్ల ఎప్పుడు ఎటు వెళ్ళాలో దానికి స్పష్టం గా తెలుసు. అది సాత్విక ఆగ్రహం నన్ను మరింత బలవంతుడిని చేస్తుంది తప్ప విచక్షణ కోల్పోయ్యేలాచేయదు" అన్నాడు.
------
సాత్వికమైన కోపం ఎలా ఉంటుందో శ్రీ కృష్ణుడి సమాదానం లో మనకు స్పష్టమవుతుంది. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా మార్చే కోపం హానికరమైనది. అలాంటి అసాత్వికమైన కోపాన్ని శుద్ధి చేయడం ద్వారా రౌద్రరసం లోని శక్తి మనకు ప్రయోజనకరమవుతుంది. కోపం వచినప్పుడు మనం కొంచెం కోపాన్ని, మనకు ఎదురైన పరిస్థితినీ చెరో వైపు నిలబెట్టి తూకం వేయాలి. పరిస్థితికి తగ్గట్టుగా ఉన్నా కోపం సరైనది, సత్వికమైనది. దానికి బిన్నంగా ఉన్నా కోపం అనారోగ్యకరమైనది, అవాన్చనీయమైనది .
-----
ఆగ్రహాన్ని బేరీజు వేయడానికి ధర్మ మీటర్ లాంటి భౌతిక ఉపకరణాలు లేవు. మనసులోని ఆధ్యాత్మిక కేంద్రం ద్వారానే ఇది వీలవుతుంది. పరిస్థితికి అనుగుణమైన కోపాన్ని ప్రదర్శించాల్సిందే. అలాంటి కోపం చెమట లాంటిది. శరీరంలోని మురికి చెమట ద్వారా బయటకు వచ్చినట్లుగా పరిస్థితికి సరితూగే ఆగ్రహాన్ని మనం వ్యక్తం చెయ్యాలి. లేకపోతే అది మనసులో పొరలు పొరలుగా పేరుకొని ఉంటుంది. కోపం గతానికి చెందినధైతే దాన్ని అక్కడే పూడ్చి పెట్టడం మంచిది. అలాకాకుండా గతం చూరును పట్టుకొని వేలాడితే వర్తమానం చెడుతుంది. భావిష్యతు పాడవుతుంది. పరిస్థితికి మించిన కోపం మీలో జాడలు విప్పినప్పుడు జాగ్రతగా గమనిస్తే దాని మూలాలు దుఖంలో కనిపిస్తాయి. అప్పుడు కోపాన్ని పక్కన పెట్టి దుఖానికి కారణాలు వెతకండి. మనసుపొరల్లో గూడుకట్టిన దుఃఖం చురుగ్గా మారినప్పుడు కోపం రూపంలో విరుచుకుపడుతుంది. ఈ కల్లోలాన్ని చక్కదిద్ది మానసిక స్థితిని శుద్ధి చేస్తే దుఃఖం తొలగిపోతుంది.__ స్వామి సుఖబోధానంద

18, నవంబర్ 2009, బుధవారం

పసిడి పలుకులు -1

1.  జీవించడం ఇవ్వడానికే! ఇచ్చేవారే జీవిస్తారు. 

2.  ధనికుడిగా మరణించేవాడు అపకీర్తితో మరణిస్తాడు.  మరణం రావడానికి ముందు మనచుట్టూ వున్న ప్రపంచానికి సేవ చేసే నిమిత్తం కావలసినంతగా ఇద్దాం. 

3.  కొందరే సంపద కలిగి వుంటారు. మనలో చాలామందిని సంపద సొంతం చేసుకుంటుంది. 

4. ధనంతో నీవు ఎన్నిటినో కొనుక్కో వచ్చు.  కాని గొప్పగా ఎంచుకొనే శీలం, నీతి, విదీయులైన మిత్రులూ, ఆధ్యాత్మిక సంపదను మాత్రం నీవు కొనలేవు. 

5. నీకేంతమంది సేవకులు ఉంటారో చూసి లోకులు అంత మర్యాదను నీకు ఇస్తారు.  ఇహలోకంలో నీవు ఎంతమందికి సేవ చేసావో దాన్ని బట్టి నీ గొప్పతనం నిర్ణయించబడుతుంది.

6.  మౌనంగా సేవ చేయి.  ప్రియంగా సేవ చెయ్యి.  నిరాడంబరంగా సేవ  చెయ్యి ప్రతిఫలాన్ని దేన్నీ కోరుకోకుండానే సేవ చేయి.  "కృతజ్ఞున్ని!" అనే మాటను కూడా ఎదురుచూడకు.

7.  జీవితం స్వల్పం.  దురదృష్ట జీవుల సీవలో నీకు వీలైనంతగా సేవ చేయడానికి త్వరపడు.

8.  నీవు ఇవ్వాలనుకుంటే ఆలస్యం చేయు. వెంటనే ఇచేయ్యి.

9.  నీకు మల్లి తిరిగి ఎన్నటికీ ఇవ్వలేని వారికి నీవు ఈడైనా ఇచీదాక నీవు పరిపూర్ణంగా జీవిన్చానట్లే!

10.  మనిషి జీవితంలో మూడు అతి ముఖ్యమైనవి.  మొదటిది ఇవ్వడం.  రెండోది ఇచి, ఇచినదాన్ని పద్దులో రాసుకోకపోవడం.  మూడోది ఇవ్వడం - ఇచినట్లు నీవు పూర్తిగానే మర్చిపోవడం! 

13, నవంబర్ 2009, శుక్రవారం

వికారం తగ్గాలంటే ..మంతెన సత్యనారాయణ రాజు

జీర్ణ క్రియలో దోషాల వలన ఎక్కువగా వికారం వస్తుంది.  నిద్ర లేచిన వెంటనే ప్రేగులలో పసర్లు ఎక్కువగా వున్నా తిన్నది సరిగా అరగకపోయినా ఆహారం తిని బస్సు, కారు లాంటివి ఎక్కినా, ఆహారంలో సరిపడని విష పదార్ధాలు వున్నా వికారాలు వస్తూ వుంటాయి.  వికారం వున్నప్పుడు వాంతి అయితే బాగున్తుందనిపిస్తుంది.  ఈ లోపు కళ్ళు కూడా తిరుగుతూ కుదురు లేనట్లు వుంటుంది.  వాంతి వచ్చినట్లుంటుంది  కానీ వాంతి రాదు.  వాంతి అయితే బాగుంటుందని ఆందరికీ అనిపించినా వాంతి చేసుకోవాలనే ఆలోచన పట్టాడు.  వికారం ముదిరితే కానీ వాంతి అవదు.  వాంతి ఐతీ కానీ తిక్క తగ్గదు.

చిట్కాలు:  
1 .  అవకాశం వుంటే గోరువెచ్చని నీరు, లేనప్పుడు బిందెలో నీరు 5, 6  గ్లాసులు గ్లాసులు (ఉప్పు కలపకుండా) ఆపకుండా త్రాగండి.  ఇంకా త్రాగ గలిగితే త్రాగండి.  నీరు త్రాగుతుంటే వికారం ముదరాలి.  త్రాగేతప్పుడే వాంతి వచ్చేటట్లు త్రాగండి.  త్రాగాలేనప్పుడు ఆపి వ్రేళ్ళను నోటిలో పెట్టి వాంతి చేసుకోండి.  మనము త్రాగిన నీళ్ళు వెళ్లి లోపల వున్నా దోషాన్ని పట్టుకొని బయటకు వచేస్తాయి.  పొట్టలో ఆహరం వున్నా సరే ఎప్పుడు వికారం వుంటే అప్పుడు ఇలా వాంతి చేసుకోవచ్చు.  వెంటనే ఏమి తినకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని తేనె నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు కాని త్రాగితే హాయిగా వుంటుంది... 

10, నవంబర్ 2009, మంగళవారం

అసలైన ఆరోగ్యానికి, సిసలైన అవసరాలు __ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

1. వేలుగోచ్చే వరకు పరుండటం మాని, వేకువ జామునే లేవడం మంచిదను....!
2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిదను!
3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనసు మంచిదను....!
4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రానయామాలు మంచిదను....!
5. చెమట పట్టకుండా తినడం మాని, చమట పడితేనే తినడం మంచిదను....!
6. వీడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్ళు తలకు మంచిదను....!
7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన మంచిదను....!
8. పూరీలు, దోసెలు మాని మొలకెత్తిన విత్తనాలు మంచిదను!
9. పచ్చి కొబ్బరిని క్రొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం మంచిదను....!
10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు మంచిదను....!
11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం మంచిదను....!
12. ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం మంచిదను....!
13. కూరలకు తొక్కలు తీయడం మాని, తినడం మంచిదను....!
14. కూరలను వేయించడం మాని, కొద్దిగా ఉడక నివ్వడం మంచిడను....!
15. కూరలలో నీటిని వార్చడం మాని, త్రాగడం మంచిదను....!
16. పచ్చి కూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి మంచిదను....!
17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం మంచిదను...!
18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం మంచిదను....!
19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పడే పడే నమలడం మంచిదను....!
20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం మంచిదను....!
21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర మంచిదను....!
22. ఖరీదు గల హైబ్రీడ్ పళ్ళు తినడం మాని, నాటు పళ్ళు తినడం మంచిదను....!
23. పళ్ళు రొంప అనడం మాని, రోగ నిరోధకానికి మంచిదను....!
24. పల్లలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం మంచిదను....!
25. రసాలను త్రాగానడం మాని, నమలడం మంచిదను....!
26. పనికిరాని కాలక్షీపం మాని, మనస్సుకు దైవ చింతన మంచిదను....!
27. గదులలో మగ్గడం మాని, ఎండా తగలడం రోగనిరోధకానికి మంచిదను....!
28. ఫ్యాన్లు, ఏ.సి లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి మంచిదను....!
29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, ౩,౪, సార్లు సాఫీగా అవడం మంచిదను....!
30. పైకి పౌడర్లు, అత్తర్ల పూత మాని, రెండు పూటలా స్నానం మంచిదను.
31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం మంచిదను.
32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి మంచిదను....!
33. రాత్రికి పీకలదాకా తినడం మాని, ఫ్రీ గా తినడం మంచిదను....!
34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము మంచిదను....!
35. తిని పాడుకోవడం మాని, అరిగాక పాడుకోవడం మంచిదను ....!
35. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం మంచిదను....!
37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు మంచిదను....!
38. రోజూ బీరు, కూల్ క్రింక్స్ మాని, కనీసం ౬ లీటర్ల మంచి నీరు మంచిదను....!
39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహరాంలో ఉన్నా ఉప్పే ఆరోగ్యానికి మంచిదను....!
40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం మంచిదను....!
41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం మంచిదను....!
42. ఎందు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి మంచిదను....!
43. అపకారం చేసే నూనె, నీతులు మాని, నేటి కాలానికి ఇది మంచిదను....!
44. మషాలాలు ఆహారంలో మాని, ముందుగా వాడటం మంచిదను...!
45. చీటికి, మాటికి మందులు మాని, అత్యవసరానికి మంచిదను....!
46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్లి పండుగలకు మాత్రమే మంచిదను....!
47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిదను....!
48. "రుచులను తిననివాడు మనిషా..." అని మనడం మాని, మనిషి అదుపులో రుచి మంచిదను....!
49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహరం తినడం మంచిదను....!
50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం మంచిదను....!
51. ఆకలి లేనప్పుడు ఆహరం మాని, నీరు త్రాగడం మరీ మంచిదను....!
52. "ఛీ ! ఎనిమా " అనడం మాని, రూగానికి ఎనిమా మంచిన్డను....!
53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యాన్నికి మంచిదను....!
54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం మంసిడను....!
55. భాద్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, ౧౦౦ సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిదను....!
56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి మంచిదను....!
57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి మంచిదను....!
58. ఎదుటివారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం మంచిదను....!
59. సాటివారిని ద్వీషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి మంచిన్దు....!
60. ప్రకృతి విధానాన్ని, వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం మంచిదను....!

8, సెప్టెంబర్ 2008, సోమవారం

స్నానం విశిష్టత__ డాక్టర్ మంతెన సత్యనారాయణ raju

ప్రతి ఒక్కరికీ సామాన్యంగా ఉదయం స్నానం చేయడం అలవాటు వుంటుంది. కానీ ఆ స్నానాన్ని ఏదో నాలుగు చెంబులు చేసేస్తే పని అయిపోతుందని మ్రోక్కుబడిగా గడిపేస్తారు. స్నానం ఎంత ఆరోగ్యమో తెలిస్తే అలా చేయలేము. మన శరీరంలో చలిని స్వీకరించే కణాలు ఎక్కువగా ఉంటాయి. వేడిని స్వీకరించేవి కొద్దిగా వుంటాయి. పెద్దలు చన్నీటిని సజీవమని, వేడి నీటిని చచ్చిన నీరని అంటుంటారు. చన్నీటి స్నానం చేయడం వలన చర్మానికి, కండరాలకు, రక్తనాళాలకు సంకోచ వ్యాకోచాలు రెండూ ఉంటాయి. అదే వేడి నీరు చేసినప్పుడు వ్యాకోచించడమే జరుగుతుంది. ఉదయం స్నానం చన్నీటి తో తలకు చేయాలి. ఎక్కువమంది స్నానం మెడవరకే చేస్తారు. తల మనది కాదంటారా? శరీరం సుభ్రమయితే సరిపోతుందంటారా? తల అక్కరలేదా ? అనింటి కంటే మనస్సుని చల్లబరచడం చాల ముఖ్యం. ౨౪ గంటలూ ఎక్కువ పని చేసే మనస్సు నిద్రలో కూడా ఎంతోకొంత పని చేస్తూనే వుంటుంది. అలాంటి మనస్సును చల్లబరిస్తే ప్రశాంతంగా వుంటుంది. చన్నీటిని తలకు పోసుకోవడం వలన తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చన్నీటితో భుజాల వరకు పోసుకుని, తల మీద చన్నీరు పోయనప్పుడు భుజాల నుండి క్రింద భాగాలలో వేడి అంతా తలకు ఎక్కుతుంది. ఉదాహరణకు వేసవి కాలంలో కాలే నేల మీద నీరు పోస్తే నెలలోని వేడి అంతా పైకి వస్తుంది కదా! అలాగే చన్నీటితో తల తడవనప్పుడు, శరీరం తడపడం ద్వారా వచ్చిన వేడి వెను వెంటనే పై ప్రదీశానికి ఎక్కుతుంది. మనస్సు వేడెక్కకోడదంటారు. చల్ల బరచ వలసిన మనస్సును వేదేక్కిస్తున్నాము. రోజంతా లేనిపోని కోపాలు, టెన్షన్లు, చిరాకులు, పోట్లాతలతో, మనస్సును వేడెక్కించింది చాలక ఆఖరుకు స్నానం చేసేటప్పుడు కూడానా? తెలిసో, తెలియకో మనిషి ఎంత పొరపాటు చేస్తున్నాడు! మన పెద్దలు ఉదయం చన్నీటిని తలకు తప్పనిసరిగా పోసుకునేవారు. వేసవిలో వారు బుర్ర వేడెక్కకుండా నెత్తికి గొడుకు, కాళ్ళకు చెప్పులు తప్పనిసరిగా వాడేవారు. మరి ఇప్పటి అందరి అలవాట్లు ఎలావున్నాయి అంటే ప్రతి రోజూ స్నానం చేసేది ఒక పూట. అదీ వేడి నీటితో వంటికి మాత్రమే . పైగా చేయివేస్తే జర్రున జారి, నురుగులు వచ్చే సబ్బులు, నాలుగు చుక్కలు షాంపూ వేస్తే రుద్దీ రుద్దకుండానే పొంగిపోయే నురుగులు. సబ్బులలో మురుకిని పోగొట్టి, నురుగు వచ్చేటట్లు చేసే పదార్దాలు వుంటాయి. వాటిని సర్ ఫేస్ యాక్టివ్ ఏజెంట్లు అంటారు. అవి చర్మం మీద మురికితోబాటు చర్మంపైన సున్నితమైన పొరను పోగొడతాయి. అందుకనే సబ్బుపెట్టి స్నానం చేసిన తరువాత చర్మం పొడిగా, తెల్లగా, ఎండిపొయినట్లు వుంటుంది. అలావస్తుందని మరలా చర్మం మీద కోల్డ్ క్రీములు గానీ నూనె గానీ రాసుకుంటారు. చర్మం ఎప్పుడూ నిగ నిగలాడుతూ ఉండాలనుకుంటారు. అందరికీ చర్మం ఎప్పుడూ అలాగే వుంటుంది. దానిని రోజూ సబ్బులు వాడి పోగొట్టుకుని మరలా క్రీములు రాసుకుంటూ ఉంటాము. చలికాలంలో కూడా చర్మం పగుళ్ళు కానీ, తెలుపుగా గానీ సబ్బులు రుద్దకుండా వుంటే రాదు. ఏ క్రీములు నూనెలు రాసే అవసరమే లేదు. సబ్బు రుద్దడం వలన ఇంకో నష్టం ఏమిటంటే, సబ్బురాసుకుని రెండుసార్లు పైకి క్రిందకి చేతిని కదిపేసరికి నురుగు వచ్చేస్తుంది. అందరి అభిప్రాయం ఏమిటంటే నురుగు వస్తే కుళ్ళు వదిలి నట్లేనని. ఆ నురుగులో చర్మంపై నున్న దుమ్ము, మురికి, జిగురు పోవచ్చు. చర్మాన్ని రుద్ద కుండానే నురుగులు రావడమే ఇక్కడ నష్టం. అది ఎలాంటిదంటే ఉప్పు, కారాలు ఎక్కువుగా ఉన్నా ఆహారపు ముద్దను నోట్లో పెట్టుకున్నప్పుడు, నమలకుండానే లాలాజలం ఊరి ముద్దను త్వరగా మింగేస్తాము. సరిగా నమలనందు వలన ఆహారం అరగదు. సబ్బులలో నున్న మందుల కారణంగా, రుద్దకుండా, నురుగు రావడంతో, చర్మాన్ని చేతులతో మర్దన చేయడం తగ్గిపోతుంది. మన పెద్దలు సబ్బు వాడేవారు కాదు. వారు సున్నిపిండితోనో, వట్టి చేతులతోనో చర్మాన్ని రుద్దేవారు. చర్మంపై మట్టి పోవాలని అలా రుద్దే వారు. అలా రుద్దడం వలన చర్మం వేడెక్కుతుంది. ఎందు వల్లనంటే చర్మాన్ని రుద్దేటప్పుడు లోపలవున్న రక్తం ఎక్కువ చర్మానికి వస్తుంది. తద్వారా స్నానం చేసేటప్పుడు చర్మానికి రక్తప్రసరణ బాగా జరగడం ఒక ప్రయోజనం. రెండవది చర్మ రంధ్రాలలో నున్న చెడు పదార్ధం కూడా స్నానం చేసేటప్పుడు గట్టిగా రుద్దడం వలన బయటకు వచ్చేస్తుంది. మామూలుగా చర్మానికి రక్తప్రసరణ మెల్లగా జరుగుతుంది, చర్మం చివ్వరి భాగం కాబట్టి. బంతి భోజనాలలో ముందు కూర్చున్నవాడికి వంటలు లోటులేకుండా త్వరగా అందుతాయి కదా! అలాగే గుండె కూడా దగ్గరవున్న భాగాలకు రక్తాన్ని త్వరగా అందించి, దూరంగా వున్నవాటికి అలస్యంగా అందిస్తుంది. అందువలనే చర్మ వ్యాధులు తొందరగా తగ్గవు.
**** అలాగే మన చర్మానికి రక్తప్రసరణ బాగా జరగాలంటే శరీరాన్ని స్నానం చేసేటప్పుడు బాగా వేడెక్కేటట్లు రుద్దడం మంచిది. సబ్బులు వుంటే ఎక్కువ సేపు రుద్దలేరు. అందువల్ల సబ్బులు వాడడం మంచిది కాదు. సబ్బులు లీనప్పుడు మురికి వదలాలని చేతులతో భాగాలన్నితిని గట్టిగా రుద్దగలుగుతాము. శరీరాన్ని రుద్దేటప్పుడు కళ్ళను క్రిందనుండి పైకి రుద్దుకోవాలి. అలాగే చేతులను క్రింద నుంచి భుజాల వైపు రుద్దుకూవాలి. మనకు రక్తం ఆ విధంగానే పైకి నడుస్తున్నది కాబట్టి. అలా చేయడం వలన పైకి గుండెకు చేరే రక్తాన్ని మనం చేతులతో క్రిందకు నెట్టడం జరుగుతుంది. మనం విరుద్ధమైన పని చేసి నట్లవుతుంది. స్నానం చేసే ఒక మంచి పద్దతిని వివరిస్తాను.....____
స్నానం చేయడానికి వేళ్ళముందు ఒక మెత్తటి, తెల్లని నాప్కిన్ (జేబురుమాలు గుడ్డ) తీసుకుని వెళ్ళండి. రాసుకుంటే స్నానానికి ముందు నూనె రాసుకోవచ్చును. ఒక బాత్ రూంలో సబ్బులు లేకుండా చేయండి. ముందు శరీరాన్నంతిటినీ ఒక బకెట్ నీటితో పూర్తిగా తడపండి, ఆ మెత్తటి నాప్కిన్ ను తడిపి, పిండేసి, దానితో శరీరం అంతటినీ రుద్దండి. ఆఖరుకు తలను కూడా ఆ గుడ్డతోనే రుద్దుకోవచ్చు. సుమారు ౧౦-౧౫ నిమిషాలు రుద్దటానికి పట్టవచ్చు. ౧౫ నిమిషాలు గడిచే సరికి చర్మం వేడెక్కి, చమటలు పడుతుంటాయి. ఆ తెల్లటి నాప్కిన్ మట్టితో నల్లగా అయిపోతుంది. చర్మ రంధ్రాలలో నుంచి మురికి ఈ విధంగా స్నానం చేస్తే పూర్తిగా బయటకు పోతుంది. ౧౦-౧౫ నిమిషములు గుడ్డతో పూర్తిగా చర్మాన్ని రుద్దుకోవడం అయిన తరువాత మరల ఒక బకెట్ చల్లని నీళ్ళను తలపై నుండి పోసుకోవాలి. అలా పోయడం వలన రుద్దినప్పుడు వేడికి వ్యకోచించిన రక్తనాళాలు, చర్మ రంధ్రాలు అన్నీ మరలా చలికి మూసుకుపోతాయి. (సంకోచిస్తాయి) గుడ్డతో పాదాలను బాగా రుద్దుకోవడం వలన మట్టి బాగా పోయి పగుళ్ళు దరి చేరవు. ఈ విధంగా స్నానం చేయడం వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాసం తగ్గుతుంది. సబ్బుల ఖర్చు ఉండదు. మనలో నుంచి ఎంత మురికి వచ్చిందీ ఆ తెల్లటి నాప్కిన్ ను చూస్తే తెలుస్తుంది. స్నానం చేసిన తరువాత మొహం, చర్మం ఎంత ఫ్రెష్ గా వుంటాయో, సాయంత్రం స్నానం చేసే వరకూ కూడా అలాగే వుంటాయి. దీనిని 'సంపూర్ణ స్నానం' అంటారు. చెప్పినట్లు చేయండి, మీరే ఒప్పుకుంటారు. ఇన్నాళ్ళూ స్నానం పేరు చెప్పుకొని, సబ్బుల పీరు చెప్పుకుని చర్మాన్ని ఎంత మోసం చేసామో అర్ధమౌతుంది.

6, ఆగస్టు 2008, బుధవారం

చుండ్రు తగ్గాలంటే...

1. చుండ్రు తగ్గాలంటే: - మన పెద్దలకు చుండ్రు అనే సమస్య తెలియదు. ఈ రోజుల్లో చుండ్రు అంటే తెలియని వారు ఉండరు. సహజంగా మన చర్మం వాతావరణం ని రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురులాగా ఉండే క్రొవ్వు పదార్ధాన్ని వదులుతూ ఉంటుంది. దీనివలన చర్మం మెత్తగా ఉంచబడుతుంది. తలలో ఈ జిగురు గాలి సరిగా తగలక పేడుగా కట్టి పెచ్చులు పెచ్చులుగా ఊడుతూఉంటుంది. స్నానం రోజు శరీరం వరకే చేసి తల మనది కాదన్నట్లుగా కొందరు వదిలేస్తారు. దాని వలన తల శుభ్రం కాక చుండ్రు వస్తుంది. షాంపూలు తరచుగా వాడేవారికి కూడా అందులో కెమికల్స్ చర్మం ఫై పొరను పాడు చేసి ఎక్కువ పొట్టు రాలేతట్లు చేస్తాయి. షాంపూ పెట్టిన రోజున బాగానే వుండవచ్చు కాని తరువాత రోజునుండి వాటి నష్టం బయటపడుతుంది. చుండ్రును పోగొట్టే షాంపూ అని మనం మోసపోతున్నాము. కేవలం తల స్నానం చేయనందువల్ల వచ్చే సమస్యను పరిష్కరించుకోవటానికి ఎంత డబ్బు వృధా చేస్తున్నారు, దీని కోసం ఈ మందులు వాడవద్దు.
***
చిట్కాలు:
1. ప్రతిరోజు చన్నీళ్ళ తల స్నానం చేయండి, వేడి నీళ్లు తలకు పోయకూడదు. నీళ్లు మరీ చల్లగా వుంటే కొద్దిగా వేడి నీరు కలిపి (బావిలో నీటి లాగా) ఆ నీళ్లు పోసుకోండి.
***
2. వారానికి, పడి రోజుల కొకసారి కుంకుడు కాయ రసంతో తలన్తుకోండి. చుండ్రు మరీ ఎక్కువగా వున్నప్పుడు పొడి తలకు ఆ రసం బాగా పట్టించి 5, 10 నిమిషములు అలా వుంచి అప్పుడు చన్నీటి స్నానం చేయండి. ప్రతి రోజు ఇలా కుంకుడు రసంతో ఏడు, ఎనిమిది రోజులు చేయవచ్చు (సమస్య ఎక్కువగా వున్నవారే ప్రతిరోజూ కుంకుడు రసం వాడండి).
***
3. తల ఆరిన తరువాత కొబ్బరి నూనె రాసుకోండి. నూనె రాస్తే చుండ్రు ఎక్కువ అవుతుంది అనుకుంటారు. రోజూ తల స్నానం చేసేవారికి ఏమీ కాదు. చలి కాలంలో చర్మం తెల్లగా పొట్టు లేస్తున్నప్పుడు మనం కొబ్బరి నూనె రాస్తే అది కరుచుకుపోయి సమస్య తగ్గినట్లే. చుండ్రుకు కూడా నూనె రాయవచ్చు. మన పెద్దలు నూనె బాగా రాసుకున్నందుకే చుండ్రు రాలేదు.
***
4. తల నూనె జిడ్డుగా వుంటే ప్రతి రోజూ (ఒక చేకా లేదా కాయ) నిమ్మరసాన్ని తలకు (తల పై చర్మానికి) రాసుకొని తల స్నానం చేస్తే జిడ్డు పోతుంది. తలలో జిగురు గ్రంధులు ఊరించే ఎక్కువ జిగురును శుభ్రం చేయడానికి నిమ్మరసం బాగా పనికొస్తుంది.
***************

5, ఆగస్టు 2008, మంగళవారం

దొంగ గుర్రం___

ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం వుండేది. అతను ఆ గుర్రం వీపుపైన బట్టల మూటలు వుంచి, ఒరూరు తిరిగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం వుండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయట పడి స్వేచ్చగా బ్రతకాలని ఆరాట పడసాగింది. యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తి గానే వుండేది.
***
ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేసాడు. ఆ సమయంలో వ్యాపారి ఘాడ నిద్రలో వున్నాడు. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టివున్న బండి పైకి చేరవేయ సాగాడు.
***
జరుగుతున్న తతంగాన్ని పసికట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే దానికి రాలేదు. నిశ్సబ్దంగా చూస్తూ వుండిపోయింది. దొంగ చివరి బస్తాను మోసుకు వెల్లుతుండటంతో....
***
"అయ్యా అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి" అని అడిగింది.
***
"ఎందుకు?" దొంగ అడిగాడు.
***
"ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు"
***
"మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?" దొంగ అడిగాడు.
***
"కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి వుంటాను" అంది.
***
దాని మాటలకు ఒక్క క్షణం అలోచించి చిన్నగా నవ్వాడు దొంగ. "అవునూ... నేను దొంగని. నీకా విషయం ఇప్పటికే అర్ధమయి వుండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమి.
***
"నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు... నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాసం వున్నా అడ్డు పడలేదు నేను. మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం" అంది గుర్రం.
***
గుర్రం మాటలకు నవ్వాడు దొంగ, " కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి వున్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు క్రుతగ్నతే లేదు. వుంటే నువ్విలా స్వార్ధంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి వుంచుకోవటం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పని వాడికి యజమాని అయ్యే కంటే అసలు.... పని వాడు లేక పోవడమే మేలు..." అంటూ అక్కడి నుంచి నిశ్సబ్దంగా జారుకున్నాడు దొంగ.
***
ఒక దొంగలో వున్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.

4, ఆగస్టు 2008, సోమవారం

ఈజీ వే ......

" ఈ గొర్రెల మందలోని గొర్రెలను ఎవరు ముందుగా లెక్క పెడతారో చూద్దాం" ఉపాద్యాయుడు పడి మంది విద్యార్దులకు పోటీ పెట్టాడు.
***
అందులో గణేష్ అందరికంటే ముందు లెక్కబెట్టి బహుమతి గెల్చుకున్నాడు.
***
'అందరి కంటేముందు నువ్వు ఎలా లెక్క బెట్టగలిగావు' అడిగాడు ఉపాద్యాయుడు ఆశ్చర్యకరంగా
***
ఈముంది సార్ ఈజీ. ముందు గొర్రెల కాళ్ళను చక చకా లెక్కబెట్టాను. తర్వాత నలుగుతో భాగించానంటే' జవాబిచ్చాడు గణేష్.

ద్విన చర్య ......

ఒక ప్రసిద్ధ కదా కదారచయితను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఓ విలేఖరి.
***
"మీ దిన చర్య ఎలావుంతుందండీ" అడిగాడు.
***
"ఉదయం ఆరుగంటలకు నిద్రలేస్తాను. వెంటనే పళ్ళు తోముకొని కాఫీ తాగి స్నానం వగైరాలు ముగించుకొని టిఫిన్ చేస్తాను, గంట సేపు పేపర్లన్నీ చదివి కాసేపు పిల్లలతో గడిపి ఆఫీసుకు వెళ్ళిపోతాను. సాయంత్రం క్లుబ్బుకెళ్ళి ఫ్రెండ్స్ తో గడిపి తొమ్మిది గంటలకు ఇంటికొచ్చి స్నానం చేసి భోంచేసి నిద్రపోతాను" అని చెప్పాడు రచయిత.
***
"మరి మీరు రచనలు ఎప్పుడు చేస్తారండీ" విలేకరి అడిగాడు.
***
"అవి మరుసటి రోజు చేసుకుంటాను" జవాబిచ్చాడు రచయిత.
-------------

స్పెషల్ ...

"ఎంటీ? మామూలు కాఫీ రొండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా ? ఏమిటయ్యా స్పెషల్ ?" సర్వర్ని అడిగాడు సుందరం.
****
"అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మొదటి సారి కాఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది." చెప్పాడు సర్వర్.
-----------

నెట్టండి... నెట్టండి.....

విమానం కొద్ది సేపట్లో ఎగురుతుందనగా ఓ పల్లెటూరి ఆసామి క్యాబిన్లోకి వెళ్లి పైలెట్ ని ఇలా అడిగాడు ... "సార్ విమానంలో పెట్రోలుందో లేదో చెక్ చీసుకున్నారు కదా?"
***
"ఆ" పైలెట్ జవాబు ఇచ్చాడు.
***
"ఇంజన్ బాగా పని చేస్తోంది కదా?"
***
"ఆ అన్నీ సరిగ్గానే ఉన్నాయి"
***
"బ్యాటరీ గీట్రే అన్నీ బాగానే ఉన్నాయి కదా?" అన్నాడు ఆ ఆసామీ.
***
"దేనికడుగుతున్నారు ఇదంతా?"
***
పైలట్ అడిగాడు సందేహంగా.
***
"విమానం మద్యలో ఆగిపోయిందనుకోండి... దిగి నెట్టండి బాబూ అంటారు... అందుకే ముందే అడుగుతున్న" అన్నాడు ఆ పల్లెటూరి అతను.
*******

31, జులై 2008, గురువారం

లంఖణం ని పరమ ఔషధం అని ఎందుకు అన్నారు ?

శరీరానికి ఏదైనా ఇబ్బంది (జబ్బు) వచ్చి నప్పుడు అది కూరినట్లుగా మనము తినకుండా, తిరగకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే శరీరంలో సుమారు ౭౫ శాతం శక్తి పొడుపు చీయబడుతుంది. ఆ పొదుపైన శక్తిని శరీరం రోగం నుంచి రక్షించుకునే పనిలో వాడుకుంటుంది. శరీరంలో ఎక్కడ జబ్బు ఉందో ఆ జబ్బు రావడానికి ఏ క్రిములు కారణమో ఆ క్రిములు ఎక్కడ ఎన్ని దాగి ఉన్నాయో శరీరానికి తెలుసు. ఒక్కొక్క సారి ఎన్ని రక్త పరీక్షలు చసిన జ్వారానికి కారణాలు తెలియవు. పరీక్షలు చేసే పరికరాలకు ఒక్కో సారి విషయం అందాకా పోవచ్చు గానీ ఈ శరీరానికి మాత్రం లోపల జరిగేదంతా తెలుసు. ఏ రకమైన ఇన్ఫెక్షన్ లోపల ఉన్నా దానిని త్రిప్పి కొట్టడానికి ఆ సూక్ష్మ జీవుల చర్యకు ప్రతి చర్యను చేపడుతుంది. మామూలు పరిస్థితిలో కంటే లంఖణం చేసినప్పుడు శక్తి పొదుపుకావడం వలన, వేరే పనులు నిర్వర్తించే బాధ్యత లేకపోవడం వలన, శరీరం మరింత ఉత్సాహంగా శక్తివంతంగా తన సైన్యాన్ని (యాంటీ బాడీస్) రోగ క్రిముల పైకి పంపుతుంది. శరీరంలో ప్రవేశించిన రోగ క్రిముల సంఖ్యను బట్టి, బలాన్ని బట్టి అప్పటికప్పుడు క్రొత్త గా యాంటీ బాడీస్ ని శరీరం తయారు చేసుకోగలుగుతుంది. ఈ యాంటీ బాడీస్ అనేవి చెడ్డ సూక్ష్మ జీవులను (బాక్టీరియా). హాని కలిగించే క్రిములను చంపుతాయే తప్ప, శరీరానికి పనికివచ్చే బ్యాక్టీరియాని మాత్రం చంపావు. అదే యాంటీ బయోటిక్ మందులు వాడితే చెడ్డ క్రిములతో పాటు శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా మరియు ఆరోగ్యంగా ఉండే కొన్ని కణాలు కూడా చనిపోతూ వుంటాయి. ఉదాహరణకు ఈ మధ్య ఇరాక్ కు, అమెరికాకు జరిగిన యుద్దంలో అమెరికా వారు ప్రయోగించిన మారణాయుధాల వల్ల ఇరాక్ సైనికులతో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా మరణించడం జరిగిందీ. అదే లంఖణం చేస్తే మనలోని శక్తి అంతా రోగనిరోధక శక్తిని ప్రేరేపించే దాని ద్వారా ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ తో మన శరీరంలో చేసే యుద్దము ధర్మ యుద్దము లాంటిది. మన దేశ స్వరాజ్యం కొరకు గాంధీగారు పోరాడిన పోరాటం లాగా మన శరీరం లంఖణం లో పోరాడుతుంది. లంఖణం లో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ మన శరీరంలో నిలువయింది అలాంటి క్రిములు, సూక్ష్మ జీవులు శరీరంలోకి మళ్ళీ ఎప్పుడైనా ప్రవేసించితే వెంటనే వాటిని చంపివేయడానికి సిద్దంగా ఉంటాయి. ఇంతకు ముందు వచ్చిన ఇబ్బంది లాంటిది మళ్ళీ ఇప్పట్లో రాకుండా శరీరం కాపలా కాస్తూ ఉంటుంది. లంఖణం లు చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బయోటిక్ మందులు వాడితే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన శరీరము రోగాన్ని త్రిప్పి గొట్టడానికి నేను యాంటీ బాడీస్ ను తయారు చేయలేకపోతున్నానని మనల్ని హెచ్చరించినపుడు మనం యాంటీ బయోటిక్ మందులు వాడటం తప్పు కాదు. ముందు శరీరానికి కొంచెం కూడా అవకాశమివ్వకుండా డైరెక్టుగా మందు జోలికి వెళ్ళడమే పెద్ద పొరపాటు. ఈ ప్రపంచంలో ఈ మందునైనా ఔషదమే అని అంటారు. ఏ మందునీ పరమౌషధం అని ఇంతవరకూ పిలవలేదు. ఒక్క లంఖణం ని మాత్రమే పరమౌషధమని ఎందుకన్నారంటే ప్రతి ఔషధం ఒక పదార్దం నుండీ తయరైనదే. శరీరం తయారు చేసుకునే ఈ ఔషధం మాత్రమే పదార్ధం లేని, ఔషధం కాని ఔషధం. అందుకే దీనిని పరమౌషధం అన్నారు. లంఖణం చెయ్యని ప్రాణి అంటూ ఈ భూమి మీద ఉండదు. అవన్నీ నాచురల్ యాంటీ బయోటిక్ ఐన లంఖణం ని సందర్భానికి వాడుతూ ఉంటాయి. మనము కూడా ఇక నుండీ అవసరానికి లంఖణం చేస్తూ, సలక్షణంగా బ్రతుకుదాము.

9, జులై 2008, బుధవారం

పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి?

మన శరీరానికి ఏదన్నాసమస్య వచ్చినప్పుడు తనంతట తానుగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అలవాటు శరీరానికి పుట్టుకతో వచ్చింది. అదే మన అదృష్టం. శరీరము ఈ పని చెయ్యకపోతే మనం ఏనాడో చచ్చిపోయేవాళ్ళము . (వాస్తవానికి చచ్చేది మనము కాదు శరీరము). తనకు వచ్చిన ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి శరీరానికి అదనంగా శక్తి కావలసి వస్తుంది. మన శరీరములోని శక్తిలో ఎక్కువ భాగం ఆహారాన్ని అరిగించడానికి, శ్రమ చేయడానికి ముఖ్యమ్గా ఖర్చు ఐపోతూ ఉంటుంది. సుమారుగా మనలో ఉన్నా శక్తిలో 75 శతం శక్తిని ఈ రెండు పనులు చెయ్యడానికి శరీరం ప్రతి రోజూ ఖర్చు చేయవలసి ఉంటుంది. శరీరానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బంది నుండి రక్షించుకోవడానికి తనలో రోజూ ఖర్చు అయ్యే ఈ 75 శతం శక్తిని పొడుపు చేసుకుని, రక్షణ కార్యక్రమానికి ఉపయోగించే పన్నాగం పన్నుతుంది. రోజంతా మనిషి అలవాటుగా తింటూ ఉంటే, అలాగే తిరుగుతూ ఉంటే మనలో శక్తి పొడుపు కాదు కాబట్టి, తినకుండా తిరగకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. నూరు తియ్యగా లాలాజలం ఊరుతూ ఉంటే తినాలని ఉంటుంది కాబట్టి నాలుకను పాచితో నింపి, దాన్ని చేదుగా చేసి, లాలాజలం ఊరకుండా చేసి మనకు ఆహరం మీద వాంఛ లేకుండా చేసి, పొట్టలో ఆహరం పడకుండా మొదటి జాగ్రత్త చర్య తీసుకుంటుంది. మనం హుషారుగా ఉంటే అటూ ఇటూ తిరుగుతూ పనిచేస్తాము కాబట్టి, తిరగకుండా ఉంచడం కోసం ఒళ్ళు నొప్పులుగా, పులపరంగా, నీరసంగా చేసి పడుకుంటే బాగుంటుందని మనకనిపించేతట్లుగా చేసి రెండవ జాగ్రత్త చర్య తీసుకుంటుంది. ఇలా రెండు రకాలుగా శరీరం శక్తిని పొదుపు చేసే ప్రయత్నం చేసి, రక్షణ కార్యాన్ని నిర్వహించడానికి ఆ శక్తి వినియోగిస్తూ ఉంటుంది. ఆ రక్షణ పని పూర్తయ్యే వరకూ మనకు తినాలని ఉండదు, తిరగాలని ఉండదు. ఇది శరీర ధర్మం. మీకు పుట్టాక ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా వచ్చాయా? రాలేదని ఎవరూ అబద్దం చెప్పలేరు. మనం తింటే తినవచ్చు, తిరిగితే తిరగవచ్చు. ఒక్క సారి ఆలోచించండి! శరీరం ఎవరిని బాగుచేయడానికి ఈ కష్టమంతా పడుతోంది. మన సుఖం గురించే కదా దాని తాపత్రయమంతా. అమెరికా నుండి బుష్ ను అడిగి కాస్త శక్తి అప్పుగా తెచ్చి ఇవ్వమని మనల్ని ఇబ్బంది పెట్టడం లేదే! మనల్ని నూతులలో, గోతుల్లో దూకమనడం లేదే! రక్షణ కార్యక్రమం చేపట్టడానికి కావలసిన శక్తి అంతా నాలో ఉన్నది నాకు సరిపోతుంది, నీవు ఆ శక్తిని వృధా చేయకుండా ఉంటే అదే నా అదృష్టంగా భావిస్తానంటుంది. అది అడిగింది ఒక చిన్న కోరికే గదా! ఇన్నాళ్ళూ నీవు శుభ్రంగా తినేటట్లు, తిరిగేతట్లు చేశాను, ఐనా ఈనాడు ఒక సారి కూడా థాంక్స్ చెప్పిన పాపాన పోలేదు. ఐనా పట్టించుకోకుండా నా డ్యూటీని నేను చీసుకుంటూ పోతున్నాను. కానీ, ఈ రోజు నాకు బాగోలేదు కాస్త రెస్టు ఇవ్వమని అడిగినా నా మాట వినవా! అని శరీరం సందర్భమొచ్చినప్పుడు ప్రదీయపడుతూ ఉంటుంది. ప్రతి రోజూ పట్టించుకోక పోయినా కనీసం ఆపద వచ్చినప్పుడైనా ఆదుకుంటే మన జీవనయానం, సుఖంగా సగేతట్లు చేస్తుంది గదా ! శరీరం గోడు వినిపించుకోవడానికి చదువు సంధ్యలు, తెలివి తేటలు, వైద్య శాస్త్రాలు అవసరం లేదు. అసలు మనకు ఆ గోడు వినిపించక పోవడానికి ఇవే అడ్డుగోడలు. పొట్టను మాడిస్తే జబ్బులేలా తగ్గుతాయి? అవన్నీ మూఢ నమ్మకాలు, సైంటిఫిక్ విషయాలు కాదు అని కొందరు వైద్యులు తిడుతూ ఉంటారు. పొలాన్ని దున్ని ఎండ గట్టినప్పుడే గట్టినప్పుడే తెగుళ్ళు తగ్గుతాయి. విద్యా శాస్త్రాలు, సైన్సు అనే మాట పుట్టక ముందే అసలు మనిషి పుట్టక ముందే పొట్టను మాడ పెడితే జబ్బులు తగ్గుతాయనే సైన్సు పుట్టింది. అదే ప్రకృతి సైన్సు. ఈ సైన్సు ను ఎవ్వరూ మార్చడానికి లేదు. జీవులున్నంత వరకూ ఈ సైన్సు వాటిని రక్షించేది కూడా. చివరకు మనకు కూడా అదే గతి. నమ్మిన వాడు ఆ జంతువుల్లాగా బాగుపడతాడు. నమ్మని వాడు మనిషిలా బాధపడతాడు.

7, జులై 2008, సోమవారం

పిక్కల నెప్పులు పోవాలంటే ... మంతెన సత్యనారాయణ రాజు

బలహీనత వల్ల ఎక్కువగా పిక్కల నొప్పులు వస్తూ వుంటాయి. ఆహరం మంచిగా తినకుండా ఎక్కువ పని చేసుకునే వారికి ఆ నీరసంలో ముందు పిక్కలు లాగుతాయి. ఎక్కువగా నడిచే వారికి ఆ కండరాలు శ్రమను తట్టుకోలేక వస్తూ వుంటాయి. శరీరంలో ఉప్పు, మెగ్నీషియం లాంటి లవణాలు తక్కువగా ఉన్నా పిక్కలు పట్టేస్తూ వుంటాయి. ఉప్పును పూర్తిగా మానిన వారికి క్రొత్తలో వారం, పది రోజులు వచ్చి ఆ తరువాత తగ్గుతుంటాయి. దీనికి పరిష్కారం ఏమిటంటే మనం చేసే పనికి శరీరం తట్టుకునేతట్లు మంచి ఆహరం తింటే సరిపోతుంది.

***

చిట్కాలు:

౧. తెల్లటి అన్నం మాని ముడి బియ్యం అన్నాన్ని వండుకొని రెండు పూటలా సరిపడా తింటే ౧౫, ౨౦ రోజులలో తగ్గుతాయి. ఎక్కువ పని వలన వచ్చే పిక్కల నొప్పులు ముడి బియ్యం అన్నానికి తగ్గిపోతాయి.

౨. ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను ముఖ్యమ్గా పాల కూర లాంటి వాటిని రోజూ వండుకుని బాగా తింటే లవణాల లోపం తగ్గుతుంది.

౩) పిక్కలు పట్టేస్తూ వుంటే లేదా ప్రయాణాలలో నడక ఎక్కువగా నడిచినందుకు నొప్పిగా వుంటే కొద్దిగా కొబ్బరి నూనె పిక్కలకు రాసి మర్దనా చేసి వేడి నీటి కాపడం ౧౦ నిమిషాలు పెట్టుకుంటే ఆ బడలిక అంతా పోతుంది.

4, జులై 2008, శుక్రవారం

లంఖణం ( ఉపవాసం) ని కనిపెట్టింది ఎవరు.... డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు..,.,

దాహం వేస్తే నీరు త్రాగాలని మనకు తెలుస్తున్నది. శరీరానికి నీరు కావలసి వచ్చినప్పుడు అది అడుగుతోంది. మనము త్రాగుతున్నాము. ఈ విషయంలో అన్ని జంతువులు ఇలానే ప్రవర్తిస్తాయి. దాహానికి నీరు త్రాగాలనే విషయం తెలియడానికి ఇంకొకరు మనకి చెప్పనవసరం లేదు. మనం ఇంకొకరిని అడగవలసిన పని లేదు. దాని కొరకు చదువుకోవలసిన పని లేదు. వైద్యుల సలహా అక్కర్లేదు. ఆకలి వేస్తే శరీరం నాకు ఆహారము కావాలని మనల్ని అడుగుతుంది. అప్పుడు మనం తింటే దాని అవసరం తీరి ఊరుకుంటుంది. ఆకలి వేస్తే ప్రతి జంతువు శరీరానికి ఆహారాన్ని అందించాలని తెలుసుకుని అందిస్తున్నాయి. అలాగే శరీరము అలసిపోతే, నాకు అలసటగా ఉందని తెలియ చేస్తుంది. అప్పుడు మనం విశ్రాంతి తీసుకుని దానికి సహకరిస్తున్నాము. జంతువులన్నీ అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలని తెలుసుకుని అలానే తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా వాటికీ ఎవరూ బోధించవలసిన పనిలేదు. పైన చెప్పిన మూడు విషయాలలో జంతువులు, మనము కూడా ఒకే విధముగా ప్రవర్తిస్తున్నాము. ఏ శరీరమైనా ఈ ధర్మాలు ఒక్కటేనని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు నాలుగో విషయం ఆలోచిద్దాము. శరీరానికేప్పుడైనా బాగోకపోయినా, ఆకలి లేకపోయినా, పొట్ట మందంగా ఉన్నా, జ్వరంలా వచ్చినా అప్పుడు శరీరం, నాకు బాగోలేదు, ఈ రోజుకి నీవు కాస్త తినడం మాని, తిరగకుండా పడుకుంటే బాగుంటుందని కోరుకుంటుంది. అప్పుడు మనకు వెంటనే శరీరం చెప్పినట్లు విందామనిపిస్తుంది. మనకు బుడ్డి, జ్ఞానమున్నది కదా! కాసేపటికి వేరే విధముగా ఆలోచనలు మారతాయి. అప్పుడు మనం ఏమి చేస్తాము. మన అమ్మకో, నాన్నకో లేదా ఇంట్లో పెద్దవారికో మన పరిస్థితి చెప్పుకుంటాము. ఇప్పటికే భోజనం లేటు అయ్యింది, తినకపోతే నీరసం వస్తుంది, ఈ పూటకు తిను, సాయం కాలం డాక్టరు దగ్గరకు పోదాములే అని సలహా ఇస్తారు. వండింది వేస్తూ అవుతుంది అనో, తినక పోతే నీరసం వస్తుందనో, ప్రక్కవారు తినమన్నారనో మనకు ఇష్టం లేకపోయినా తింటాము. మనం ఇక్కడ శరీరం కోరినట్లుగా కాక దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి చివరకు డాక్టరు దగ్గరకు పోయి శరీరాన్ని అప్పగిస్తాము. ఈ విషయంలో 84 లక్షల జీవరాసులు ఏమి చేస్తాయో చూద్దాము.

***

శరీరం నాకు బాగోలేదు, నీవు తినవద్దు, తిరగ వద్దు అని కోరింది కాబట్టి వెంటనే ఆ క్షణం నుండీ తినడాన్ని పూర్తిగా ఆపేస్తాయితినవలసిన పనిలేకపోతే ఇంకా తిరగవలసిన పని వాటికేముంటుంది. కాబట్టి విశ్రాంతి కూడా శరీరం కోరినట్లు ఇచ్చి హాయిగా పడుకుంటాయి. తిండి మనడం, విశ్రాన్తినివ్వడం అనే రెండు పనులు చెయ్యడానికి వల్ల అమ్మ, నాన్నలనో, ప్రక్కనుండే స్నీహితులతోనో ముచ్చటించవలసిన పనిలేదు. ఇక్కడ ఇవి శరీర ధర్మాన్ని గౌరవించి వట్టిగా పాడుకుంటాయి. "ధర్మో రక్షతి రక్షితః" అన్నట్లు ఆ ధర్మమే వాటిని కాపాడుచున్నది. ఇలా శరీరం వద్దన్నానని రోజుల పాటు విశ్రాంతి నిచ్చి, మరలా నాకు ఆహరం కావాలని శరీరం కోరినప్పుడు తినడం ప్రారంభిస్తాయి. ఇలా శరీరం వద్దన్నప్పుడు ఆహారాన్ని తినడం మాని, విశ్రాంతి నివ్వడం అనేదాన్ని ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఆచరించి చూపుతూ వాటి ఆరోగ్యాన్ని అవే కాపాడు కుంటున్నాయి. ఈ ధర్మాన్ని అవి వాటి పిల్లలకు, మనుమలకు అలా బోధించవలసిన పని లేకుండా, తరతరాలుగా ప్రతి జీవికి పుట్టుకతో ఈ జ్ఞానం తెలుస్తూనే ఉంటున్నది. ఈ జ్ఞానం జంతువుల వలె మనిషికి కూడా అనాదిగా వస్తూ ఉన్నది. మనిషి కూడా నియమం తప్పకుండా ఈ శరీర ధర్మాన్ని గౌరవించడం జరిగిందీ. పేరు పెట్టడం వరకే మనిషి హస్తం తప్ప లంఖణం ని మనిషి కనిపెట్టలేదు. మనిషి పుట్టక ముందే లంఖణం పుట్టింది. అది ఈ భూమి పై జీవులు శరీరాన్ని ధరించినప్పటి నుండీ ఉన్నా ధర్మం. దాహానికి నీరు, ఆకలికి ఆహరం, అలసటకు విశ్రాంతి ఎలాంటి ధర్మాలో రోగానికి లంఖణం ఉండడం అలాంటి ధర్మమే. ఈ లంఖణం అనేది ఒక మతానికి గాని, ఒక కులానికి గానీ, ఒక దేశానికి గానీ, ఒక జాతికి గానీ, ఒక ప్రకృతి వైద్యానికే గానీ సంబంధించినది కాదు. శరీరమున్న ప్రతి జీవికి సంబంధించిన విషయం. ఇదేదీ మూదాచారమూ కాదు. చదువుకొని, వైద్య శాస్త్రం తెలియని మన పెద్దలు కనిపెట్టింది కాదు. అది శరీరానికి పుట్టుకతో వచ్చే సహజ ధర్మమూ. ఇన్ని కూతల రకాల శరీర నిర్మాణ సారధి ఎవరో, ఆయన ఈ శరీరాలకు ఆరోగ్య నిమిత్తం ఇచ్చిన వరం. దానిని జంతువుల వలె మనిషి కూడా గౌరవిస్తే ఆరోగ్యం వరం. లేదా రోగాల పరం.

3, జులై 2008, గురువారం

మనం చేసే పెద్ద పొరపాటు ___ మంతెన సత్యనారాయణ రాజు

వివేకముతో ఆలోచిస్తే మనం వేరు. మన శరీరం వేరు. మనం జన్మ తీసుకున్తున్నమంటే (పుడుతున్నామంటే) శరీరాన్ని ధరించి భూమి పైకి వస్తున్నాం. చనిపోతున్నమంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. విశేషమేమిటంటే పుట్టుక నుండి చావు వరకు మనము, మన శరీరము ఒకటిగానే జీవిస్తున్నాము. శరీరము లేకుండా జీవితమనేదే లేదు. చావుపుట్టుకలు మన చేతిలో లేవు గాని ఆ రెండింటి మధ్యన వుండే జీవితం మన చేతిలోనే వుందిఅలాంటి జీవితం ఆరోగ్యమ్గా, సుఖంగా సాగినా లేదా అనారోగ్యంతో, బాధలతో సాగినా దానికి మనమే బాధ్యులం తప్ప శరీరానికి సంబంధం లేదు. ఈ శరీరానికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ తప్పు మనదే. శరీరం మనం ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి మనం చెప్పినట్లు అది నడవాలి. అలాగే మనం దాన్ని ఇబ్బంది లీకుండా నడిపించుకోవాలంటే అది చెప్పినట్లు కూడా మనం వింటూ వుండాలి. అపుడే జీవితమనే ప్రయాణం గమ్యం చేరే వరకు సుఖంగా సాగుతుంది. కానీ మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శరీరం చెప్పినట్లు మనం వినడం లేదు. దాని అవసరాల్ని మనం పట్టించుకోవడం లేదు. అందు చేతనే రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాము. మన ఇష్టా ఇష్టాలు దానిమీద రుద్దుతున్నాము తప్ప దానిగోడు వినిపించుకోవడం లేదు. ప్రతి జీవి శరీరము ఒక ఆటోమాటిక్ యంత్రము లాంటిది. శరీరానికి తనంతట తనే బాగు చేసుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. ఆ శక్తి పనిచెయ్యాలంటే శరీరము చెప్పినట్లుగా మనం విని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఈ శ్రుష్టిలో 84 లక్షల జీవరాసులుంటే, అవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటి శరీరాన్ని ఏ డాక్టరుకి అప్పగిస్తున్నాయి? ఏ రకాల రక్తపరీక్షలు, ఎక్స్ రే లు తీయించు కుంటున్నాయి? వాటి ఆరోగ్య రహస్యం ఏమిటి? నూటికి నూరు శాతం అవి ఆరోగ్యాన్ని పొందడానికి అవి ఆచరించే ఆరోగ్య రహస్యం ఒక్కటే. అదే శరీరం చెప్పినట్లు వినడమే.
***
మనిషి కూడా కొన్ని వేళ సంవత్సరాలు ఇదే ధర్మాన్ని ఆచరించి డాక్టరు లేకుండా రోగం రాకుండా జీవించగాలిగాడు.
***
ఇంతమంది వైద్యులు, ఇన్ని రకాల వైద్య విధానాలు ఉంచుకుని కూడా పూర్తి ఆరోగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు? మనకి వైద్యుడికి అవకాసమిద్దామని తెలుస్తోంది కానీ వైద్యుడి కంటే ముందు శరీరానికి అవకాసమిద్దామని తెలియడం లేదు. అసలు శరీరానికి జబ్బులు తగ్గించుకునే గుణం ఉన్నట్లే చాలా మందికి తెలియదు. మనం తాయారు చేసిన వాహనానికి ఏదైనా రిపేరు వస్తే తనంతట తానూ బాగు చేసుకోలేదు. దానిని తయారు చేసినది మనిషే కాబట్టి చివరికి మనిషే దానిని రిపేరు చేయవలసి వస్తున్నది. మరి మన శరీరాన్ని మనం తయారు చేసామా? మనం తయారు చేసినది కాదు కాబట్టే మన ఊహకు అందని, మన తెలివితేటలకు సాధ్యం కాని అద్భుతమైన యంత్రాంగం ఈ శరీరంలో ఉంది. ఆటోమాటిక్ గా నడిచే కార్లు ఇంతవరకు మనిషి కనిపెట్టలేక పోయాడు కానీ మనం ప్రయాణించే ఈ శరీరమనే కారు మాత్రం ఆటోమాటిక్ గా నడుస్తుంది. అలానే ఆటోమాటిక్ గా రిపేరు చేసికొనే శక్తి కూడా దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని అదే చేసుకొని పోతుంది. మనకు తెలియకుండానే మనం శరీరానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ వుంటాము. దానికి నెలలు కావలసి వచ్చినప్పుడు నీళ్లు త్రాగం. మనకి ఇష్టమైనప్పుడు త్రాగుతాం. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాం. నాకిప్పుడు రెస్ట్ తీసుకునే టైము అయిపోయింది నేనిక అరిగించలేను అని అది చెప్తున్నా వినకుండా రాత్రి పొద్దుపోయి అన్నం పెడతాము. మనం తిన్నదంతా అరిగించి మిగిలిన వేస్ట్ విసర్జించడానికి రెడీ గా పెట్టుకొని ఉన్నా దానిని బయటకు పంపకుండా ఆపేస్తాము. ఏదైనా రోగ పదార్ధము లోపలికి ప్రవేశించినప్పుడు దానిని బయటకు పంపే ప్రయత్నంలో జ్వరం రూపంలో నోరు చెడు రూపంలో మనకి అది సూచనలిచ్చినా పట్టించుకోకుండా, దానికి బాగు చేసుకునే అవకాసం ఇవ్వకుండా డాక్టరు దగ్గరకు వెంటనే పరిగెడతాము. డాక్టరు ఏదో మందు వేస్తాడు. దానితో తను చెయ్యాల్సిన పని ఆపేస్తుంది. ఇలా మందులు వేస్తూ వుండటం వల్ల శరీరానికి వున్నా రోగాన్ని నిరోధించుకునే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. జబ్బులను తగ్గించే అవకాసము ముందు మన శరీరనికిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరమే ఒక గొప్ప డాక్టరు అని గ్రహించాలి. మన శరీరము తగ్గించలేనపుడు మందు వేసుకోవడం తప్పు కాదు. ముందు శరీరం కోరినట్లుగా మనం మారడం, దానికి అనుకూలంగా బ్రతకడం అలవాటు చేసుకుందాం.